logo

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయండి

తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు.

Published : 01 May 2024 04:20 IST

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి
నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. నంద్యాల పట్టణంలోని 4వ వార్డుకు చెందిన 300 కుటుంబాల వారు మంగళవారం వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్‌, నాయకులు శ్రావణ్‌, పబ్బతి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి, నాయకులు సందీప్‌, సురేశ్‌, మణిదీప్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని