జగన్ జమానాలో ‘కూలి’న బతుకులు
ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది..
భవన నిర్మాణ కార్మికులపై నిర్లక్ష్య వైఖరి
బోర్డు నిధులు పక్కదారి పట్టించిన సర్కారు
కణకణమండే.. గలగల తొణకే కార్మిక శక్తి లేకుంటే ఈ లోకంలో ఒక్క రోజు గడవదు. ప్రపంచ మనుగడే లేదు. కార్మికులకు ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. కొత్త ప్రాజెక్టుల ఊసులేదు.. ప్రైవేటు నిర్మాణాల జాడ లేదు.. కూలి‘వెతల’ పాలనలో భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు.!
- న్యూస్టుడే, వెంకటరమణ కాలనీ
గద్దెనెక్కారు.. పస్తులుంచారు
వైకాపా సర్కారు వచ్చీ రాగానే నిర్మాణ రంగంపై కత్తి కట్టారు. ‘కొత్త ఇసుక విధానం’ పేరిట రీచ్లను మూసేశారు. ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. భవనాలు, ఇళ్ల పనులన్నీ ఆగిపోవడంతో కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఆ తర్వాత కరోనా లాక్డౌన్తో వారికి మళ్లీ పని దూరమైంది. అలాంటి క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులకు పని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అర్ధాకలితో అలమటించేలా చేసింది.
సంక్షేమ నిధులు మళ్లింపు
భవన, నిర్మాణ రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఉంది. గుత్తేదారుల సెస్, సభ్యత్వ రుసుము రూపంలో ఏటా రూ.కోట్లు బోర్డుకు జమవుతాయి. దీనికి సమాన గ్రాంటు ఇచ్చి ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,70,750 మంది కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారు. నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. శ్రామికుల సంక్షేమానికి భవన నిర్మాణదారుల నుంచి ప్రత్యేకంగా వసూలు చేస్తున్న 1 శాతం పన్ను మొత్తాన్ని నవరత్న పథకాలు, ఇతర అవసరాలకు వాడుకుంటోంది.
కార్మికులు సంఖ్య
భవన నిర్మాణ రంగం - 1,45,350
దుకాణాలు, హోటళ్లు - 50,000
కర్మాగారాలు - 23,500
నాపరాతి గనులు - 3,600
మట్టి, ఇతరాత్ర - 48,300
బీమా.. డ్రామా కార్మికులు సంఖ్య
ఒకే కుటుంబంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఎవరు చనిపోయినా సంక్షేమ బోర్డు నుంచి బీమా పరిహారం వస్తుంది. వైఎస్సార్ బీమాలో కుటుంబ పెద్ద చనిపోతేనే వర్తింపజేస్తారు. కొన్నిచోట్ల దంపతులు, వారి పిల్లలు భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. వీరి పేర్లు బోర్డులోనూ నమోదై ఉన్నాయి. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా పరిహారం వస్తుంది. మిగతా వారికి వర్తించడం లేదు. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా వారికి మేలు చేస్తున్నామన్నట్లు ప్రచారం చేసుకుంటోంది. కుటుంబ యజమాని కాకుండా కుటుంబంలోని ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందడం లేదు. గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు.
అంశం పెండింగ్లో దరఖాస్తులు
వివాహ కానుక - 17
ప్రసూతి - 4,881
ప్రమాదవశాత్తు మరణం - 33
అంగవైకల్యం - 0
సహజ మరణం - 303
వైద్య సాయం - 18
అంత్యక్రియలు - 129
ఒక్కరికీ అందని సాయం
కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నిధుల నుంచి సాయం అందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం కార్మికుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల నమోదును మూడు నెలల్లోపు పూర్తి చేయాలని సూచించింది. ఈ పథకం కింద రూ.5 వేల చొప్పున సాయమందుతుందని ప్రచారం చేయడంతో వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రానికి రూ.189 కోట్లు అందినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కరికీ నగదు సాయం అందలేదు.
అందని పెళ్లి కానుక
భవన నిర్మాణ కార్మికులకు వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం అందలేదు. ఈ సహాయాన్ని రూ.లక్షకు పెంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, ఇందులో రూ.40 వేలు బోర్డే చెల్లిస్తోంది. వధువు పదో తరగతి చదివి ఉండాలన్న నిబంధన కారణంగా కొందరు సాయానికి దూరమవుతున్నారు.
ఎంతో మేలు చేసిన తెదేపా
తెదేపా హయాంలో భవన నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి అదనపు ప్రయోజనాలను కల్పించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వివాహ కానుకను ముందుగా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి రోజే అందజేసేవారు. ప్రసూతి సాయం అంటూ ప్రత్యేకంగా కార్మికుల కుటుంబాలకు అందించేవారు. పని ప్రదేశాల్లో చనిపోయినా, అంగవైకల్యం పొందినా బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్న వెంటనే అందించేవారు. కార్మికుల సంక్షేమ బోర్డు నుంచే నిధులు పక్కాగా చెల్లించేవారు. రోజుల వ్యవధిలో క్లెయిమ్లు పరిష్కారమయ్యేవి. కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చారు. కార్మికులు ఎన్నో ప్రయోజనాలు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక మింగారు.. కాలుష్యం నింపారు
[ 22-05-2024]
రాయలసీమ జీవనదిగా పేరొందిన తుంగభద్ర కాలుష్య కోరల్లో చిక్కుకుంది. సుంకేసుల జలాశయానికి అతి సమీపంలో నది లోపల బోట్ల సాయంతో (డ్రెడ్జింగ్) ఇసుకను తోడేశారు.. నాలుగేళ్లుగా జలాశయం వెనుక జలాల్లో భారీ ఎత్తున ఇసుక తవ్వేశారు. -
కుందూ మన్ను.. అక్రమార్కుల కన్ను
[ 22-05-2024]
కుందూ తీరంలో మాఫియా మన్ను బుక్కుతోంది.. నది వెంట 20 కి.మీల పొడవున ఆయా గ్రామాల్లో పలుచోట్ల పొక్లెయిన్లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లతో అక్రమ రవాణా చేస్తున్నారు. -
చెమ్మగిల్లిన చెరువు
[ 22-05-2024]
నీటి వనరులు ‘చిన్న’బోతున్నాయి.. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికి చెరువులపైనా శీతకన్నేసింది. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 22-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. -
పత్తి చేనులో గంజాయి సాగు
[ 22-05-2024]
కర్ణాటకలోని బళ్లారిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఆరా తీయడంతో డొంక కదిలింది. -
ఆటల్లో సత్తా.. గురుకులంలో సీటు
[ 22-05-2024]
గురుకుల విద్యాలయం పేద విద్యార్థుల ఆశా కిరణంగా నిలిచింది. ఇందులో సీటు రావాలంటే పోటీ పరీక్షల్లో సత్తా చాటాలి. కొంత మంది క్రీడాకారులు ఆటల్లో చూపిన ప్రతిభతో క్రీడా కోటా కింద సీటు పొందారు. -
తేరుపై జ్వాలా నృసింహుని విహారం
[ 22-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలతో ఎగువ అహోబిలం ఉత్సవ శోభను సంతరించుకుంది. స్వామి నిత్య అలంకృతుడై వాహనాలపై దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. -
నీటి పరీక్ష కిట్లకు.. కటకట
[ 22-05-2024]
ప్రజలు అనారోగ్యానికి గురవడానికి ప్రధాన కారణం నీరు కలుషితం కావడమే. జిల్లాలో చాలా ప్రాంతాలలో నీరు కలుషితం కావడంతో అతిసారంతో మరణాలు సంభవించడంతో పాటు, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. -
విజ్ఞాన వేదిక.. వినోదాల కానుక
[ 22-05-2024]
ప్రస్తుతం బాలలకు చరవాణే ప్రపంచం.. పుస్తక పఠనం మరిచారు.. ఆటపాటల ఊసే లేదు.. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు గ్రంథాలయ సంస్థ వేసవి వినోదానికి శ్రీకారం చుట్టింది. -
నగర నగిషీలు.. నగుబాటు
[ 22-05-2024]
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కూడళ్లలో సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. గతంలో పలు ప్రాంతాల్లో బొమ్మలు, పచ్చదనం ఉండేలా కూడళ్లను తీర్చిదిద్దారు, ప్రస్తుతం వాటిని తొలగంచి మళ్లీ పనులు చేస్తున్నారు. -
సంక్షేమం కాదు.. తలపై గండం
[ 22-05-2024]
కర్నూలు నగరంలోని సంక్షేమ భవనం పెచ్చులూడి చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లేకపోవడం, మరమ్మతులు అసలే చేపట్టకపోవడంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. -
నంద్యాల పట్టణంలో నాకాబందీ
[ 22-05-2024]
ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. -
బ్యాంకు ఖాతాలోని రూ.50 వేలు మాయం
[ 22-05-2024]
ఆత్మకూరు పట్టణంలోని రహ్మత్నగర్కు చెందిన పెయింటర్ షేక్ మహబూబ్బాషా బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు చోరీకి గురయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..