logo

చేనేత కుటుంబాలను ఆదుకుంటాం

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు.

Published : 08 May 2024 02:01 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కుటుంబాలను ఆదుకుంటామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు. పద్మశాలి, తొగటవీర క్షత్రియ, కుర్ని, దేవాంగ కులస్థుల ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసింది శూన్యమని వారు విమర్శించారు. నంద్యాల పట్టణంలో మంగళవారం వారు జిల్లా చేనేత వర్గీయులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పద్మశాలీల అభివృద్ధికి తెదేపా ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని