logo

నూర్‌బాషా కార్పొరేషన్‌కు ఏటా రూ.100 కోట్లు

తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు.

Published : 08 May 2024 02:02 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏట్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డా.బైరెడ్డి శబరి, ఎన్‌ఎండీ ఫరూక్‌ హామీ ఇచ్చారు. దూదేకుల కులస్థుల ఆర్థికాభివృద్ధికి రాయితీ రుణాలను అందజేస్తామని చెప్పారు. నంద్యాల పట్టణంలో దూదేకుల ఫెడరేషన్‌ మాజీ ఛైర్మన్‌ డా.బాబన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నూర్‌బాషా, దూదేకుల వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, కౌన్సిలర్‌ జైనాబి, వాసవి పాఠశాల కరస్పాండెంట్‌ దస్తగిరి, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం నూర్‌బాషాల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. దూదేకుల సంఘం నాయకులు షేక్షావలి, డి.హుసేనప్ప, ఆదాం సాహెబ్‌, డీజీ దస్తగిరి, హుస్సేన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని