logo

వైకాపా స్టిక్కరు వద్దంటే.. పరిహారం రాదు

పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది.

Published : 08 May 2024 02:20 IST

న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం: పాణ్యం మండలంలోని పిన్నాపురం గ్రామంలో వైకాపా ప్రచారంలో భాగంగా ఇంటింటికీ సిద్ధం స్టిక్కర్లను అతికించడం వివాదంగా మారింది. ఎన్నికల నిబంధనల అమలుపై దృష్టి పెట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థుల మధ్య వివాదం నెలకొంది. స్టిక్కర్లను తొలగించ వద్దని కొందరు నాయకులు హెచ్చరికలు జారీ చేసినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఇళ్లకు స్టిక్కరు అతికించుకోని భూ నిర్వాసితులకు నష్ట పరిహారం రాదని భయపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని