అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
అరకొరగా చేరిన పాఠ్య పుస్తకాలు
తొలిరోజు అందరికీ ఇవ్వడం కష్టమే
నగరంలోని పుస్తక నిల్వ కేంద్రం
కర్నూలు విద్య, న్యూస్టుడే : నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 1 నుంచి పది తరగతులకు 27 టైటిల్స్తో 46,98,726 పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించగా జిల్లాకు ఇప్పటివరకు 5,40,752 పాఠ్య పుస్తకాలు అందాయి. ఇందులో 8, 9, 10వ తరగతికి చెందిన పాఠ్య పుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఆయా ఎంఈవోలకు చేరనున్నాయి.
తగ్గిన ప్రతిపాదన
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 4,66,836 మంది విద్యార్థులు ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి 1 నుంచి పది వరకు ఉన్న తరగతులకు స్పెల్-1 కింద 38,18,504, స్పెల్-2 కింద 13,53,517 పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఏడాది మాత్రం 46,98,726 పాఠ్య పుస్తకాలు అవసరమని నివేదిక ఇచ్చారు. గతేడాదికి .. ఈ ఏడాదికి తేడా చూస్తే 4,73,298 పాఠ్య పుస్తకాలు తగ్గాయి.
వచ్చినవీ సగమే
ఆరో తరగతికి సంబంధించి సాంఘిక శాస్త్రం పుస్తకాలే వచ్చాయి. ఏడో తరగతికి హిందీ, తెలుగు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఎనిమిదో తరగతికి ఇంగ్లిషు, జీవశాస్త్రం, హిందీ, సాంఘిక శాస్త్రం (ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు), గణితం (ఉర్దూ మీడియం) తదితర పుస్తకాలు ఎంఈవోలకు చేరాయి. తొమ్మిదో తరగతికి జీవశాస్త్రం మాత్రమే వచ్చింది. 10వ తరగతికి చెందిన అన్ని సబ్జెక్టులకు వచ్చినప్పటికి అరకొరగా సరఫరా కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేయాలి
[ 16-06-2024]
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ అన్నారు. -
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ
[ 16-06-2024]
పట్టణంలోని నాలుగో వార్డులో ఆదివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. -
నంద్యాల ప్రజల నీటి కష్టాలు త్వరలోనే తీరుస్తాం : మంత్రి
[ 16-06-2024]
నంద్యాలలో ప్రజల నీటి కష్టాలను త్వరలోనే తీరుస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరుక్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీవోలు
[ 16-06-2024]
ఎమ్మిగనూరు తాలూకా ఏపీ ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో సభ్యులు నూతనంగా ఎన్నికైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం
[ 16-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా బనగానపల్లికి వచ్చిన ఆయనకు జనం బ్రహ్మరథంపట్టారు. -
కుప్పకూలిన కేసీ కాల్వ గోడ
[ 16-06-2024]
నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామ సమీపంలో 72వ గేటు వద్ద కేసీ కాల్వ పక్క గోడ శనివారం కుప్పకూలింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 16-06-2024]
పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ద్విచక్రవాహనాన్ని కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది -
హంద్రీ అభివృద్ధికి పడాలి అడుగులు
[ 16-06-2024]
హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత ప్రభుత్వాలు భావించి దీన్ని నిర్మించడంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టాయి. -
రామోజీరావు సేవలు చిరస్మరణీయం
[ 16-06-2024]
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కౌతాళం మండలం, కుంబళనూరు ఉషోదయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్ కొనియాడారు. -
దశల వారీగా నగరాభివృద్ధి
[ 16-06-2024]
కర్నూలు నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. -
‘కొలువు’ నిలవాలని ఖాకీల కాక
[ 16-06-2024]
అవకాశం వస్తే రెచ్చిపోవడం, లేదంటే కాళ్ల బేరానికి రావడం పోలీస్ శాఖలో కొందరు అధికారులకు అలవాటుగా మారింది. -
నాన్న మాట.. గెలుపు బాట
[ 16-06-2024]
మనసుపై ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రజాసేవలో తరించిన తండ్రిని చూసి స్ఫూర్తి పొందారు.. నాన్నను చూసి రాజకీయం నేర్చుకున్నారు..
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన