దేవుడి భూముల రక్షణకు చర్యలు
మొదట సాగుచేసుకుంటారు.. అనంతరం నెమ్మదిగా తమ పేరుమీదికి మార్చుకుంటారు. అనంతరం అమ్మేస్తుంటారు. దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న తంతు ఇది.
సాంకేతిక సమస్యలే అడ్డంకి
కర్నూల్ జిల్లా కల్లూరు శివారులో అలంపూర్ ఆలయాలకు సంబంధించిన భూమిని ఆక్రమించుకునేందుకు పలుమార్లు జరిగిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల కొందరు యువకులు అందులో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేయగా ఈవో పురేందర్ వెళ్లి దాన్ని తొలగింపజేశారు. ఇక్కడ ఎకరా దాదాపు
రూ.కోట్లలోనే పలుకుతోంది. ఇక్కడ 12 ఎకరాల దేవాలయ భూమి ఉంది.
ధరూరు మండలం ద్యాగదొడ్డి శివారులో శివాలయానికి సంబంధించిన భూమి ఇది. సుమారు 19 ఎకరాలుంది. ప్రస్తుతం ఇది ఇతరుల చేతిలో సాగులో ఉంది. దేవాలయానికి ఎటువంటి ఆదాయమూ ఒనగూరడం లేదు.
ధరూరు, అలంపూర్, న్యూస్టుడే: మొదట సాగుచేసుకుంటారు.. అనంతరం నెమ్మదిగా తమ పేరుమీదికి మార్చుకుంటారు. అనంతరం అమ్మేస్తుంటారు. దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న తంతు ఇది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశాలు ఇవ్వటంతో మరో సారి వాటి రక్షణ అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. అనేక ఆలయాలకు సంబంధించిన భూములను గతంలో సంరక్షులుగా ఉన్నవారు రెవెన్యూ లొసుగులను ఉపయోగించుకొని అధికారుల అండతో ఓఆర్సీ పత్రాలను సృష్టించుకొని పట్టాదారులుగా మారిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరణి రికార్డుల ప్రకారం 15449.63 ఎకరాల భూములున్నాయి. వీటిలో 1,776 ఎకరాల వరకు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు.
ధరణితో వెలుగులోకి: ధరణి పోర్టల్ అందుబాటులోకి రానంత వరకు మిగులు భూములుగా ఉన్నవి రికార్డు పరంగా చాలా తక్కువ విస్తీర్ణంలో కనిపిస్తూ వచ్చాయి. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములను యథాతథ స్థితికి తీసుకొచ్చినమోదు చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దాని ఆధారంగా ఉమ్మడి జిల్లాలో చాలా వరకు దేవాలయ భూములు సర్వేనంబర్తో సహా ధరణిలో దర్శనమిచ్చాయి. ఓఆర్సీల ఆధారంగా భూములు పొందిన వారు అమ్మేసుకున్న భూములు సైతం ఖాతా మార్పులు కానివి ధరణిలో దేవాలయ భూములుగానే కనిపిస్తున్నాయ. రికార్డుల్లో ఉన్నా ఆక్రమణదారులుగా మాత్రం ఆలయ అర్చకులు, సంరక్షకులు, ఆక్రమణదారులు, కౌలుదారులే కొనసాగుతున్నారు. రికార్డుల్లో మాత్రం దేవాలయ భూములుగా నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని మంత్రి ఆదేశాలు ఇవ్వటంతో ఆక్రమణదారుల్లో కలకలం మొదలైంది.
సాంకేతిక అడ్డంకులు అధిగమిస్తేనే: ఇక దేవుడి పేరుతో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఎవరి పేరుతో జారీ చేయాలన్నదే అసలు సమస్య అని రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులంటున్నారు. అమల్లో ఉన్న ధరణి పోర్టల్ నిబంధనల మేరకు ఆధార్ కార్డు ఐడీగా ఉంటే తప్ప పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం కుదరదు. ఒక వేళ దేవుడి పేరుతో పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా దేవుడికే ఆధార్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దేవుడి వేలిముద్ర తీసుకొని ఆధార్ ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదు. ఒక వేళ కస్టోడియన్గా దేవాదాయ అధికారుల పేరుతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలంటే నిబంధనల మేరకు కుదరని పరిస్థితి. ఇలా సాంకేతిక సమస్యలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలంటే నిబంధనల సవరణ తప్పనిసరి. రెండు రోజుల కిందట జరిగిన ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో కూడా ఈ అంశంపైనే సుదీర్ఘ చర్చజరిగినట్లు తెలిసింది. జిల్లా పాలనాధికారికి బాధ్యతలు అప్పగించి భూములకు కస్టోడియన్గా ఆయన పేరుతో పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
విధివిధానాలు రావాలి: దేవుడి భూములకు పట్టాదారు పాసుపుస్తకాల జారీ అంశంపై ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాణృ విధివిధానాలు రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుంది.
శ్రీనివాసరాజు, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుంకేసుల జలాశయం నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. -
అత్తారింట్లో అల్లుడి దారుణ హత్య
[ 16-06-2024]
ఉండవెల్లి మండల కేంద్రంలో అత్తారింటికి వచ్చిన అల్లుడు హత్యకు గురైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన -
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి: డీకే అరుణ
[ 16-06-2024]
పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. -
పాలమూరుకు కొత్త పాలనాధికారులు
[ 16-06-2024]
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్ల బదిలీల్లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం కలిగింది. ఆయా జిల్లాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కలెక్టర్లుగా వస్తున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
నాన్నా వందనం.. విజయం నీకంకితం!
[ 16-06-2024]
తల్లి బిడ్డను నవమాసాలు మోస్తే.. తండ్రి పాతికేళ్లు మోస్తాడు. కలలో, మెలకువలో పిల్లల గురించే ఆలోచిస్తాడు. సమాజంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ఎంత ఖర్చయినా భరిస్తాడు. -
జనరంజకంగా ప్రజాపాలన
[ 16-06-2024]
రాష్ట్రంలో ప్రజాపాలన జనరంజకంగా కొనసాగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పర్యటించారు. -
చిన్నపొర్ల ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 16-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. చిన్నపొర్ల ఘటనకు సంబంధించి శనివారం ఆయన ఇక్కడ ఠాణా వద్ద విలేకరులతో మాట్లాడారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబ్నగర్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై విజయ్కుమార్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన తౌసిఫ్ అన్వర్ అలీ(20) దేవరకద్ర సమీపంలోని స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. -
భవనాలు శిథిలం.. సమస్యలు అనేకం
[ 16-06-2024]
భాషాభివృద్ధికి, స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన గ్రంథాలయాలు అవసాన దశకు చేరుతున్నాయి. రెండు దశాబ్దాలుగా లైబ్రేరియన్ల నియామకం లేకపోవడంతో జిల్లాలో ఉన్న ఒకరిద్దరికి మూడు, నాలుగు గ్రంథాలయాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
సీట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ
[ 16-06-2024]
ఈ చిత్రం శనివారం మధ్యాహ్నం ధన్వాడ కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న మరికల్ ఆంగ్ల మాధ్యమ కేజీబీవీ వద్ద కనిపించింది. ఆరో తరగతి ప్రవేశాల కోసం పిల్లల్ని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఎలాగైనా ప్రవేశం కల్పించాల్సిందిగా ప్రత్యేకాధికారి రాజ్యలక్ష్మికి విన్నవిస్తుండగా తీసింది. -
సుంకేశుల నుంచి నీటి విడుదల
[ 16-06-2024]
వర్షాల ప్రభావంతో తుంగభద్ర నదికి వరద ప్రవాహం పెరగడంతో రాజోలి శివారులోని సుంకేశుల జలాశయం నుంచి 2 గేట్లను ఎత్తి శనివారం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి 18,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. -
గత కలెక్టర్పై భూ అక్రమాల ఆరోపణ
[ 16-06-2024]
జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి పనిచేసిన సమయంలో భూ అక్రమాలకు పాలడ్డారని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఓఎస్డీ హరిప్రసాద్కు శనివారం సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు