logo

‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌’

రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు.

Published : 23 Apr 2024 03:40 IST

మాట్లాడుతున్న ఎంపీ రాములు

కందనూలు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎంపీ రాములు విమర్శించారు. సోమవారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో పార్లమెంట్‌ స్థాయి రైతు సమ్మేళనం నిర్వహించారు. ఎంపీ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధాని మోదీ పదేళ్లుగా రైతుల సంక్షేమానికి వివిధ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత వేసవికాలంలో ప్రాజెక్టులో సాగునీరు లేక రైతుల పంటలు ఎండిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని