రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాగర్కర్నూల్ : పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం
కందనూలు, న్యూస్టుడే: పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ, రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుత వేసవి కాలంలో రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రంలో రక్తపు యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువకులు స్వచ్ఛదంగా స్పందించి రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
అందుబాటులో 24 యూనిట్లు మాత్రమే
రక్తనిధి కేంద్రంలో ప్రస్తుతం 24 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎ పాజిటివ్ 1, బి పాజిటివ్ 2, ఓ పాజిటివ్ 21 యూనిట్లు ఉన్నాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా ఏర్పడిన తరువాత జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన క్షతగాత్రులు వైద్యం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి వస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు కొన్ని సందర్భంలో రక్తం ఎక్కిస్తున్నారు. జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల గర్భిణులను ప్రసవాల నిమిత్తం జనరల్ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ప్రతి రోజు 30 వరకు ప్రసవాలు నమోదు అవుతున్నాయి. గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేయడానికి వైద్యులు కృషి చేస్తున్న కొంత మంది గర్భిణీలకు రక్తం తక్కువగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా వైద్యులు రక్తం ఎక్కించి శస్త్ర చికిత్స, సాధారణ కాన్పులు చేస్తున్నారు. రక్తనిధి కేంద్రం నుంచి ప్రతి రోజు రోగుల పరిస్థితిని బట్టి 5 నుంచి 10 రక్తపు యూనిట్లు అందజేస్తున్నామని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న 24 యూనిట్లు వారం రోజులకు మాత్రమే సరిపోతాయని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆసుపత్రిలోని రోగులకు ఇబ్బందులు కలగకుండా యువకులు రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.
యువకులు స్పందించాలి
ప్రస్తుతం రక్తనిధి కేంద్రంలో 24 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా రక్తపు యూనిట్లు అందజేస్తున్నాం. యువకులు స్వచ్ఛందగా స్పందించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.
డా.రోహిత్, రక్తనిధి కేంద్రం పర్యవేక్షకుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?