ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది.
ఒక్క ఎకరాకూ సాగునీరందని వైనం
అసంపూర్తిగా సంగాల జలాశయం అలుగు పనులు
గద్వాల, న్యూస్టుడే: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నదిగానే ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తోంది. పనులు పూర్తయ్యేదెన్నడో అధికారులకే తెలియని పరిస్థితి. ఏటా లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరిస్తున్నామని అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఇదంతా చెరువులు, బోరుబావులు కింద సాగవుతున్నదే తప్ప నెట్టెంపాడు కింద మాత్రం కాదన్నది అధికారులకు తెలిసిన సత్యమే. అయితే ఈ ప్రాజెక్టు కింద 101 ప్యాకేజి కింద రూ.51 కోట్లతో చేపట్టిన సంగాల, చిన్నోనిపల్లి జలాశయాలది భిన్నమైన స్థితి. అప్పట్లో ఈ జలాశయాల ప్రతిపాదనే వివాదాస్పదంగానే మొదలైంది. పనులు పదేళ్ల ఆలస్యం వెరిసి అంచనాలు పెరిగి ఇప్పుడు రూ.85 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది కూడా పనుల పురోగతి కనిపించటం లేదు.
ఈ ఏడాది కూడా కష్టమే
వరస ఆటంకాలతో గుత్తేదారులు గతంలో చివరికి పనులే వదిలేసి వెళ్లిపోయారు. పదేళ్ల తర్వాత పనులు పూర్తచేయటానికి ప్రభుత్వం సమాయత్తమై వేరే గుత్తేదారులకు అప్పగించింది. అప్పట్లో భూములు కోల్పోయిన రైతులు చిన్నోనిపల్లి జలాశయం పనులు అడ్డుకోవటంతో ఆటంకాలు తప్పలేదు. తీరా పనులు మొదలు పెట్టినా పూర్తికాలేదు. జలాశయం వల్ల ప్రయోజనం లేదని మా భూములు మాకే ఇవ్వాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పది వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఎకరా ఆయకట్టుకు కూడా నీరివ్వలేదు. ఇక సంగాల జలాశయం కింద 0.50 టీఎంసీ నిల్వ కోసం 600 ఎకరాల భూములను రైతులు కోల్పోయారు. వారిదీ అదే పరిస్థితి. తాజాగా పదేళ్ల తర్వాత సంగాల జలాశయం అలుగు కాల్వ పనులు మొదలైనా అవి నత్తతో పోటీపడుతున్నాయి. ఈ జలాశయం నుంచీ ఇప్పటికి ఒక ఎకరం అయకట్టుకు కూడా నీరివ్వలేరు. కారణం అసలు ఆయకట్టే లేదు. ఉన్న ఆయకట్టంతా 99 ప్యాకేజీ కుడి కాల్వ కిందకు వస్తుంది. దాని కింద 29వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సంగాల జలాశయం కేవలం బ్యాలెన్సింగ్ రిజ్వాయర్గా ఉంటుంది. రూ.51 కోట్ల జలాశయాలు కేవలం మత్స్యకారులకు చేపల పెంపకం, స్టోరేజీ జలాశయాలుగా తప్ప ఆయకట్టుకు నీరిచ్చేవి కావని రైతుల వాదన. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఈ ఏడాదైనా నీటిని నింపుతారో లేదోనని రైతులంటున్నారు. అధికారులు సైతం దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. గుత్తేదారులు మాత్రం పనులు పూర్తి చేస్తే నీటిని నింపుతామంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆత్మలొచ్చి.. అమ్ముతున్నాయ్..!
[ 17-05-2024]
ఒక్కటే రోజు మొత్తం 40కుపైగా రిజిస్ట్రేషన్లు.. ఇవన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు.. తెర వెనుక ఓ పార్టీ నేత. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగిన ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. -
పశువైద్యంలో కొత్త పోకడలు
[ 17-05-2024]
తక్కువ ఖర్చుతో, దుష్ప్రభావాలు లేకుండా వ్యాధులు నయం చేసే హోమియో మందులను యూరోపియన్ దేశాల్లో వైద్యులు పశువైద్యంలోనూ వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పశువైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. -
అభిమాని రక్తంతో ముఖ్యమంత్రి చిత్రం
[ 17-05-2024]
నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన ఓ అభిమాని తన రక్తంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రాన్ని గీయించి అభిమానం చాటుకున్నారు. -
గద్వాల కేంద్రంగా.. రేషన్ బియ్యం దందా
[ 17-05-2024]
శాంతినగర్లో గత నెల 27వ తేదీ 114 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొయిలదిన్నెరోడ్డు పక్కన ఉన్న పిండిగిర్ని నడిపే ఓ ఇంట్లో బియ్యం నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
నల్లమలలో పెరిగిన ఓటింగ్
[ 17-05-2024]
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్నికల సిబ్బంది చెంచు పెంటలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేసి పోలింగ్ను విజయవంతం చేశారు. నల్లమలలోని ఆగర్లపెంటకు రెండు కి.మీ. దూరం కాలినడకన అటవీ ప్రాంతంలో ప్రయాణించి అక్కడే బస చేసి భయం గుప్పిట్లో కాలం గడిపారు. -
చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడికి మూడేళ్ల జైలు
[ 17-05-2024]
ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడికి న్యాయస్థానం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత కథనం ప్రకారం.. -
అమ్మ కడుపు చల్లగా..
[ 17-05-2024]
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. అమ్మ కడుపు చల్లగా ఉండాలని అధికారులు సాధారణ ప్రసవాలకు చొరవ తీసుకుంటున్నారు. -
జూరాలకు కృష్ణా జలాలు
[ 17-05-2024]
జూరాల జలాశయంలోకి గురువారం ఉదయం నుంచి 2,510 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో తీసుకోదని నీటినిల్వ 0.244 టీఎంసీల మేర ఉంది. -
ప్రవేశాల పెంపే లక్ష్యం
[ 17-05-2024]
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని చెబుతూ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను తొలివిడత ప్రక్రియ ప్రారంభమైంది. -
2021లో మంజూరు.. పూర్తయ్యేదెన్నడో?
[ 17-05-2024]
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుగొమ్మలు.. మారుమూల గ్రామాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లెలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ వాటిదశ మారకపోవడం విచారకరం. -
బాధ్యత మరచి.. కుటుంబానికి దూరమై
[ 17-05-2024]
ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం ధరించక ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ప్రమాదాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన వాహనదారులు భద్రతను గాలికొదిలేస్తున్నారు. -
అయిజ విండో ఆదర్శం
[ 17-05-2024]
అయిజ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఉమ్మడి జిల్లాలోని ఇతర విండోలు ఆదర్శంగా తీసుకోవాలని నాబార్డ్ ఉమ్మడి జిల్లా డీడీఎంలు షణ్ముఖచారి, మనోహర్రెడ్డి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
-
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా