logo

కార్మికుల దినోత్సవానికి ముస్తాబు

మే డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్మికులు తమ యూనియన్‌ దిమ్మెలకు రంగులు వేస్తూ ముస్తాబు చేస్తున్నారు.

Updated : 01 May 2024 07:01 IST

 అలంపూర్‌: దిమ్మెకు రంగులు వేస్తున్న కార్మికుడు
అలంపూర్‌, రాజోలి : మే డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్మికులు తమ యూనియన్‌ దిమ్మెలకు రంగులు వేస్తూ ముస్తాబు చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మికదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకునేందుకు జెండాలను సైతం సిద్ధం చేస్తున్నారు. అలంపూర్‌ మండలం కేంద్రంలో విద్యుత్‌ శాఖకు సంబంధించిన 1104 యూనియన్‌ దిమ్మెను నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఘనంగా జరుపుకుందాం: మేడే ను బుధవారం ఘనంగా జరుపుకుందామని కార్మికులంతా నిర్ణయించారు. ఈ మేరకు రాజోలి పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులంతా సమావేశమై సమస్యలపై చర్చించారు. వేతన పెంపు, ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలనే డిమాండ్లను ప్రభుత్వాలు నేరవేర్చాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని