logo

‘5న జాతీయ నాయకులతో కాంగ్రెస్‌ సభ’

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 5వ తేదీన జాతీయ నాయకులైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరితో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎర్రవల్లిలో బహిరంగ సభ నిర్వహించతలపెట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ శాసన సభ్యులు సంపత్‌కుమార్‌ తెలిపారు

Published : 01 May 2024 06:34 IST

ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి సభకు స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌
ఇటిక్యాల, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే 5వ తేదీన జాతీయ నాయకులైన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరితో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎర్రవల్లిలో బహిరంగ సభ నిర్వహించతలపెట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ శాసన సభ్యులు సంపత్‌కుమార్‌ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక నాయకులతో కలిసి సభా ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల ప్రచారం కొనసాగుతుందన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ తాలుకా అధ్యక్షులు జోగుల రవి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షులు మాణిక్యారెడ్డి, మండల అధ్యక్షులు వెంకటేష్‌, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని