logo

గద్వాలలో భాజపా బహిరంగ సభ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఈ నెల 4న గద్వాల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

Published : 02 May 2024 17:02 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఈ నెల 4న గద్వాల పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, బూత్ స్థాయి సభ్యులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి మురుగన్, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ రాములు, నాగర్ కర్నూల్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ హాజరుకానున్నారు. రానున్న ఎన్నికల్లో దేశంలో మూడోసారి మోదీ సర్కారు విజయకేథనం ఎగురవేస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు