logo

నాగర్‌కర్నూల్‌ భారాస ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందాం

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారాస నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయడు అన్నారు.

Published : 08 May 2024 12:50 IST

రాజోలి: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారాస నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించుకుందామని అలంపూర్ ఎమ్మెల్యే విజయడు అన్నారు. ఆయన బుధవారంఇటిక్యాల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు.  తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన వెంట  ఆలయాల మాజీ  ఛైర్మన్ బాలకృష్ణ రెడ్డి, జడ్పీటీసీ  హనుమంత్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రంగారెడ్డి, మాజీ సర్పంచ్ రవిరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని