logo

బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు నింపిన డీసీఎంకు మంటలు

మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ బయట దుకాణాల ముందు మొక్కజొన్న బస్తాలతో నిలిపి ఉన్న డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 

Published : 10 May 2024 03:09 IST

జడ్చర్ల గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో నిలిచి ఉన్న డీసీఎం వాహనానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మార్కెట్లో కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను షాబాద్‌కు తలించేందుకు డీసీఎంలో నింపగా, డ్రైవర్ ఆ వాహనాన్ని మార్కెట్ బయట దుకాణాల ముందు నిలిపారు. గురువారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో డీసీఎంలో మంటలు చెలరేగి ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఉన్న మొక్కజొన్న బస్తాలకు కూడా మంటలు అంటుకున్నాయి. మార్కెట్లో ఉన్న రైతులు, సిబ్బంది మంటలను గుర్తించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయటంతో నష్టం తీవ్రత తగ్గింది. పక్కనే ఉన్న మరో మూడు వాహనాలను తీసివేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని