దృష్టి మరల్చి.. నగదు దొంగిలించి..
విదేశీ కరెన్సీ నోట్లు చూపించి.. అందుకు సరిపడా నగదు ఇవ్వాలని కోరుతూ.. వ్యాపారుల దృష్టిని మరల్చి.. నగదును దొంగిలిస్తున్న ఇరాన్కు చెందిన ముగ్గురి దొంగల ముఠాను మెదక్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ముగ్గురు ఇరానీ దేశస్థుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రోహిణిప్రియదర్శిని, అదనపు ఎస్పీ బాలస్వామి
మెదక్, న్యూస్టుడే: విదేశీ కరెన్సీ నోట్లు చూపించి.. అందుకు సరిపడా నగదు ఇవ్వాలని కోరుతూ.. వ్యాపారుల దృష్టిని మరల్చి.. నగదును దొంగిలిస్తున్న ఇరాన్కు చెందిన ముగ్గురి దొంగల ముఠాను మెదక్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్లోని ఏఆర్ హెడ్క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని వివరాలు వెల్లడించారు. ఇరాన్ దేశ రాజధాని తెహ్రన్కు చెందిన కరీం, ఇవాజీ నాదర్, బినియాజ్ బహ్మన్లు గత ఆగస్టులో దిల్లీకి వచ్చారు. అక్కడ కారును అద్దెకు తీసుకొని నెల రోజుల క్రితం హైదరాబాద్లోని కోకాపేటకు వచ్చారు. అక్కడి ఓ హోటల్ గదిలో ఉంటూ, జాతీయ రహదారులపై ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 11న, ఈనెల 1న రామాయంపేటలోని ఓ చికెన్ దుకాణం, చేగుటంలోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చి ఇరాన్కు చెందిన కరెన్సీ చూపి వాటి విలువకు తగ్గట్టు నగదు ఇవ్వాలని వ్యాపారులను కోరి, వారి దృష్టి మరల్చి దుకాణాల్లోని నగదును ఎత్తుకెళ్లారు. చికెన్ దుకాణంలో రూ.90 వేలు చోరీకి గురికాగా, తిరిగి నిందితులు మరోసారి పట్టణానికి రావడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేగుంటలో ఇదే తరహా దొంగతనం బయటపడటంతో రామాయంపేట పోలీసులు దర్యాప్తును వేగిరం చేశారు. ఈ నెల 2న రామాయంపేటలో వాహనాలను తనిఖీ చేస్తుండగా డీఎల్ 6సీజే 7714 నంబరు గల కారులో సదరు వ్యక్తులు వెళ్తుండగా, అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించారు. వాళ్లు పర్యాటక వీసాపై ఇండియాకు వచ్చారని, జాతీయ రహదారులపై ఉన్న దుకాణాల్లో దొంగతనం చేయడమే లక్ష్యంగా ఇక్కడ సంచరిస్తున్నట్లు తేలిందని ఎస్పీ వివరించారు. నిందితుల పాస్పోర్టులతో పాటు రూ.95 వేలు, 850 అమెరికన్ డాలర్లు, రూ.30.50 లక్షల విలువైన ఇరాన్ కరెన్సీ, మూడు చరవాణులు, ఇద్దరి డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ముఠా సంచరిస్తున్నట్లు తమకు సమాచారం ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్ఐ రాజేశ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.