logo

భారాస విజయం తథ్యం: కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు.

Published : 28 Mar 2024 01:27 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌: మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించటం తథ్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌లో మాట్లాడుతూ.. 100 రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని అన్నారు. రైతుల రుణమాఫీ ఊసేలేదన్నారు. విద్యుత్తు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఏటా లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీ నెరవేరలేదని, పేదల ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మాజీ సర్పంచి మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, దయాకర్‌రెడ్డి, చందు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని