డంపింగ్యార్డుల్లా ఖాళీ స్థలాలు!
పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది.
పురపాలికల్లో ఇష్టారాజ్యంగా చెత్త పారబోత
తూప్రాన్ పట్టణంలోని ఓ ఖాళీ స్థలంలో పడేసిన చెత్త
న్యూస్టుడే, మెదక్ టౌన్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట: పురపాలికల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్త వేస్తున్నారు. మరోవైపు మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. ప్లాట్లను కొనుగోలు చేసి... ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని పురపాలికల్లో నెలకొన్న దుస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం.
జిల్లాలోని నాలుగు పట్టణాలు రాజధానికి సమీపంలో ఉండడంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో చాలా మంది ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల వరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతోంది. ఖాళీ స్థలం ఉండడంతో చెత్తను పారవేస్తున్నారు. కొందరు నిర్మాణాలు చేపట్టినా మురుగు కాల్వలు లేకపోవడంతో మురుగు నీరంతా ప్లాట్లలోకి వెళ్తోంది.
జరిమానాలేవీ..
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే బల్దియా సిబ్బంది ఇది వరకు జరిమానా విధించేవారు. గత కొన్ని నెలలుగా వేయ డం లేదు. దీంతో ఇష్టారాజ్యంగా చెత్తను వేస్తున్నారు. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించడం లేదు. దీంతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించగా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. క్రమబద్ధీకరణతో ఇళ్ల నిర్మాణాలు జరిగితే సమస్య తీరుతుంది.
ఇదీ పరిస్థితి...
మెదక్ పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రధాన రహదారి వెంట, పాత, కొత్త బస్టాండ్, దాయరకు వెళ్లే మార్గంలో సినీ మ్యాక్స్ థియేటర్ సమీపంలో పసుపులేరు వంతెన, రెండు పడకల గదుల వద్ద, దత్తాత్రేయ దేవాలయం సమీపం.. తదితర ప్రాంతాలలో పట్టణ ప్రజలు బహిరంగ ప్రదేశాలలో ఇష్టానుసారంగా వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో పాటు ఔరంగాబాద్ అవుసులపల్లి సాయిబాబా మందిరం, బృందావన్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, గోల్కొండ, వెంకట్రావునగర్, సాయినగర్, రషీద్, బాబా, దుర్గా కాలనీ, దాయర తదితర ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ సరిగా లేక మురుగు ఆయా ప్రదేశాల్లోని ఖాళీ స్థలాల్లో చేరుతోంది. దీంతో దోమల బెడద పెరుగుతోంది.
- తూప్రాన్ ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం తెల్లవారుజామున చెత్తాచెదారం పారబోస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని కాలనీల్లో రెండు రోజులకు ఒకసారి చెత్త బండి తిరుగుతోంది. బండి రాని రోజు ఆరు బయటే వేస్తున్నారు.
- చెత్త బండి రావడానికి ఆలస్యమైతే రామాయంపేట మల్లెల చెరువు, పాండ చెరువు సమీపంలోని వారు సమీపంలోని చెరువుల్లో వ్యర్థాలు పడేస్తున్నారు.
- నర్సాపూర్ పట్టణంలో ఛైర్మన్ అశోక్గౌడ్ వార్డుల బాట పట్టి ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా నిరోధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం