రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.
న్యూస్టుడే, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు.
- సముచిత స్థానం దక్కటం లేదని ఆరోపిస్తూ సిద్దిపేట మున్సిపాలిటీలోని కొందరు కౌన్సిలర్లు మరో పార్టీలో చేరారు.
- పార్టీ పదవులతోపాటు పెద్ద ఎత్తున నగదు ఇస్తామన్న భరోసాతో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు పార్టీ మారినట్లు ప్రచారం సాగుతోంది.
- వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సర్పంచితోపాటు ఎంపీటీసీ, ఎంపీపీ పదవులపై కన్నేసిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు అధికార పార్టీలోకి చేరారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గజ్వేల్ మండలంలోని ఓ యువ నాయకుడు సర్పంచి పదవి ఆశించి.. గ్రామంలో పలువురు పార్టీ మారుతున్నట్లు గ్రహించి అతనే ముందుగా వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంటు ఎన్నికల వేళ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతో కండువాలు మార్చుతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న పార్టీ పెద్దలు వారిని అక్కున చేర్చుకుని పావులు కదుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా పైచేయి సాధించి విజయాన్నందుకోవాలన్న లక్ష్యంతో ప్రధానపార్టీల నేతలు చేరికలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజూ చేరికలు ఉండేలా ప్రధాన పార్టీల నేతలు చూసుకుంటున్నారు. ప్రత్యర్థి ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే వ్యూహంగా ఉంటున్నారు.
అటూఇటూ అయితే అంచనా ఎటు!
అంది వచ్చే ప్రతి అంశాన్ని వినియోగించుకుంటూ భారాస చేరికలను ఆహ్వానిస్తుండగా ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్, భాజపాల నేతలు పావులు కదుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీలు పార్టీలను వీడుతుండటం ప్రభావం ఎటువైపు ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. భారాసకు అన్నీ తానై ముందుకు సాగుతున్న మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారాలతో పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు చేజారకుండా చూస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు హనుమంతరావు, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు ముఖ్యనేతలు చేరికలను పర్యవేక్షిస్తున్నారు. భాజపాలో అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావుతోపాటు ముఖ్యనేతలు పార్టీ ప్రచారం, చేరికలపై దృష్టిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా