గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు.
సిద్దిపేటలో ఓటు అభ్యర్థిస్తున్న హరీశ్రావు, వెంకట్రామిరెడ్డి
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. ఇప్పుడు భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సైతం గోబెల్స్ ప్రచారానికి సిద్ధమవుతున్నారన్నారు. ఇలాంటివి ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సిద్దిపేటలో కోమటి చెరువు కట్ట, నెక్లెస్రోడ్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయపు నడక చేస్తున్న వారిని భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలసి ఆత్మీయంగా పలకరించారు. భారాసకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం పలు వార్డుల్లో పాదయాత్రగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో భాజపా నాయకులు మరిన్ని ఫేక్ వీడియోలు తయారు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. కొందరు నాయకులు ఆస్తులు కూడబెట్టు కోవడానికి రాజకీయాల్లోకి వస్తారని, వెంకట్రామిరెడ్డి మాత్రం తన ఆస్తులను ప్రజలకు పంచడానికి ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. బల్దియా మాజీ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు అరవింద్రెడ్డి, మోయిజ్, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
సిద్దిపేట లఘుక్రీడా మైదానంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని హరీశ్రావు సందర్శించారు. క్రీడాకారులతో క్రికెట్ ఆడారు.
చిన్నకోడూరులో రోడ్షోకు హాజరైన ప్రజలు
ప్రజలను రెచ్చగొడుతున్న భాజపా, కాంగ్రెస్
నంగునూరు, న్యూస్టుడే: హిందూ, ముస్లింల మధ్య మతత్వాన్ని భాజపా రెచ్చగొడుతుంది, భాజపా గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపిందని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం నంగునూరులో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరవుతోపాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ ఎన్నికలు అధికారం, పదవుల కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కోసమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాని కోరారు. దుబ్బాకను అభివృద్ధి చేయని రఘునందన్రావుకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా