logo

కాంగ్రెస్‌ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 03 May 2024 06:00 IST

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని కోతిరాంపూర్‌ గిద్దెపెరుమాండ్ల కమాన్‌, నాకా చౌరస్తాలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలల్లోనే ఆరు గ్యారంటీల్లో అయిదు అమలు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ తర్వాత రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇస్తామని, మహిళలకు రూ.2500 అమలు చేస్తామన్నారు. వినోద్‌కుమార్‌ వరంగల్‌ నుంచి వచ్చి పెద్దరికం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చేయలేక బండి సంజయ్‌ అక్షింతల పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు పాల్గొన్నారు. రాంనగర్‌లో, జమ్మికుంట మండలం నాగంపేటలో కార్నర్‌ సమావేశాల్లో మంత్రి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని