వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు
కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్
మాట్లాడుతున్న వినోద్కుమార్, సతీశ్కుమార్, రవీందర్రావు తదితరులు
హుస్నాబాద్, కోహెడ, కోహెడ గ్రామీణం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు. మంగళవారం కోహెడలో భారీ వర్షం కారణంగా కార్నర్ మీటింగు రద్దు చేసిన అనంతరం మాజీ శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్సీ టి.రవీందర్రావు, భారాస రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరెంటు, నీళ్లు లేక గ్రామీణ ప్రాంత రైతులకు ఇచ్చిన సౌకర్యాలు కుంటుపడ్డాయన్నారు. రైతులు భూములు వదలి పట్టణాలకు వెళ్లి కూలీ పని చేసుకునే పరిస్థితిని సీఎం రేవంత్రెడ్డి కల్పించారని ఆరోపించారు. దేవుడిని రాజకీయాలకు వాడుకున్న అంశంపై కోర్టులో కేసు వేయవచ్చన్నారు.
‘అంతర్గతంగా భాజపాకు మంత్రి మద్దతు’.. రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అంతర్గతంగా భాజపాకు మద్దతు తెలుపుతున్నట్లు తమకు అనుమానంగా ఉందని మాజీ శాసనసభ్యుడు వొడితల సతీశ్కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్తోనే అందరికీ న్యాయం
వర్గల్, ములుగు, న్యూస్టుడే: ములుగు, వర్గల్ మండలాల్లో మంగళవారం మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో వంటిమామిడి, తునికి బొల్లారం, ఆర్అండ్ఆర్ కాలనీ, ములుగులో కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్ షోలో భాగంగా మామిడ్యాలలో గిరిజన మహిళలతో కలిసి నీలం మధు నృత్యం చేశారు. నాయకులు శ్రీనివాస్, సలీం, కడపల్ల కృష్ణారెడ్డి, రమేశ్రెడ్డి, కుంట్ల లక్ష్మారెడ్డి, పోషిరెడ్డి, శ్రీనివాస్గుప్తా, ఎడ్ల పోచయ్య, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.్య అందరికీ అందుబాటులో ఉండి మెదక్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని నీలం మధు అన్నారు. ములుగు, వర్గల్ కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ఇందిరమ్మ ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు తెచ్చి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. వర్గల్ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముదిరాజులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నానపురం నర్సింలు, శ్రీరామ్, నర్సింలు పాల్గొన్నారు.
భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎన్నికలు కాగానే భూ నిర్వాసితుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని మామిడాల, బైలంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదన్నారు. బైలంపూర్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన భారాస సీనియర్ నేత ఐలయ్య యాదవ్ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు