వలస ఓటరు కలిసొచ్చేనా ..
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సొంత గ్రామాలకు వస్తూ..
న్యూస్టుడే, నారాయణఖేడ్, కొడంగల్: ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రాంతాల్లో వలసలు అధికంగా ఉంటాయి. ఆయా చోట్ల ఉపాధి సరిగా దొరక్క హైదరాబాద్తో పాటు ముంబయి, బెంగళూరు వంటి పట్టణాలకు వలస వెళ్లి వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇలా వెళ్లిన వారిని పోలింగ్ రోజు వరకు రప్పించేందుకు పార్టీల నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉంటుంది. వీరిలో సుమారు లక్ష మంది వరకు హైదరాబాదు, బీదర్ తదితర ప్రాంతాలకు కుటుంబాలతో సహా వలస వెళ్లారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,41,960 మంది ఓటర్లు ఉండగా.. 60 వేల మందికి పైగా ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. పుణె, ముంబయి ప్రాంతాలకు వెళ్లి బతుకీడుస్తున్నారు. వీరంతా ప్రధాన పండగలు, పలు కార్యక్రమాలకు సొంతూళ్లకు వచ్చివెళ్తున్నారు. ఇళ్లు, వ్యవసాయ భూములు ఉండటంతో గ్రామాల్లో రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఓటరు జాబితాలో సైతం వీరి పేర్లు నమోదై ఉన్నాయి.
ప్రణాళిక సిద్ధం: ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఏయే గ్రామాల్లో వలసదారులు ఎంతమంది ఉన్నారన్నది వివరాలు సేకరించారు. వారిని రప్పించే బాధ్యతను ఆయా గ్రామాలు ఉండే మండలాల నాయకులకు అప్పగించారు. ప్రత్యేకంగా వాహనాల ఏర్పాటు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించడం తప్పనిసరి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు నెలల ముందు నుంచే ఈ కసరత్తు చేపట్టారు. దీంతో ఎవరెక్కడ ఉన్నారనే విషయమై స్థానిక నాయకులకు పూర్తి అవగాహన ఉంది. ఓ ప్రాంతంలో ఉండేవారి సంఖ్యను బట్టి వారికి జీపు, వ్యాను, లారీ, టూరిస్టు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది సొంతంగా వచ్చి ఓట్లేసి వెళ్లే అవకాశం లేకపోలేదు.
తప్పని ఖర్చు..
ఈ రెండు నియోజకవర్గాల్లోని నాయకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతూ అక్కడే నివాసం ఉంటున్నా ఓట్లు స్వగ్రామాల్లోనే ఉన్నాయి. వారిని తీసుకొచ్చేందుకు అభ్యర్థులకు ఖర్చు తప్పదు. ఇందుకు రూ.లక్షల్లో వెచ్చించాల్సిందేనని పలువురు నేతలు చెబుతున్నారు. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఉపాధికి వచ్చిన వారూ ఉన్నారు. వీరితో అక్కడి నాయకులు సంప్రదించి తీసుకెళ్లేందుకు బస్సులు, తదితర వాహనాలను పంపిస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు