తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
అంతర్జిల్లా దొంగ పట్టివేత
కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణం), తొగుట, న్యూస్టుడే: తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అదనపు డీసీపీ ఎస్.మల్లారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తన ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారని కుకునూరుపల్లి ఠాణా పరిధి కొడకండ్ల నివాసి బి.నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన షేక్ సలీమ్(53)ను నిందితుడిగా గుర్తించారు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తుండగా, ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో కుకునూరుపల్లిలో బస్సు దిగాడు. పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు యత్నించగా పారిపోబోయాడు. అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. సలీం గత పలు గ్రామాలు తిరుగుతూ కట్పీసులు అమ్ముతున్నాడు. కుటుంబ పోషణకు, జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు ఎంచుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ చేసి రాత్రుళ్లు చోరీలు చేస్తున్నాడు. 2023 జనవరి 17వ తేదీన కొడకొండ్లలో పాత ఇనుప సామగ్రి అమ్మేవారి వద్ద ఓ కడ్డీ కొనుగోలు చేశాడు. ఓ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 4 తులాల బంగారు పుస్తెలతాడు, రూ.10 వేల నగదు అపహరించాడు. సిద్దిపేట పట్టణంలో 3, సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి, నారాయణరావుపేట, చేర్యాలలో ఒక్కో చోరీ చొప్పున చేశాడు. నేరం అంగీకరించిన సలీంను పోలీసులు అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించారు. తొగుట సీఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్, క్రైమ్ సిబ్బందిలను అదనపు డీసీపీ అభినందించారు.
లోకం చూడకుండానే..
గుమ్మడిదల: నవజాత శిశువు మృతదేహం గురువారం మండల పరిధిలో లభ్యమైంది. ఎస్సై మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని దోమడుగు పరిధి నల్లపోచమ్మ ఆలయ సమీపంలో ప్లాస్టిక్ కవర్లో నవజాత మగ శిశువు మృతదేహాన్ని గమనించి చుట్టుపక్కల వారు పంచాయతీ సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకొన్న దోమడుగు అంగన్వాడీ టీచరు వరలక్ష్మి, పర్యవేక్షకురాలు కవిత వచ్చి చూశారు. గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు మధుకర్కు తెలపడంతో ఆయన అక్కడికి వచ్చి శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. పుట్టగానే పడేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
రామాయంపేట, న్యూస్టుడే: గుర్తుతెలియని ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి వైపు నడుచుకుంటూ వెళ్తూ రోడ్డు దాటే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
పోక్సో కేసులో జీవితఖైదు
రామాయంపేట, న్యూస్టుడే: పోక్సో కేసులో ఓ వ్యక్తికి జీవితఖైదుతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పు ఇచ్చినట్లు గురువారం జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలికపై అత్యాచారం చేసిన నిజాంపేట మండల పరిధి నార్లాపూర్ గ్రామానికి చెందిన మన్నె నర్సింలుపై 2021 అక్టోబరు 5న పోక్సో కేసు నమోదైంది. నిందితుని కోర్టులో హాజరుపరచగా కేసు వివరాలు పరిశీలించిన జడ్జి, నిందితుడు నర్సింలుకు జీవితఖైదుతో పాటు రూ.1.50లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్సీ తెలిపారు.
ఎన్నికల శిక్షణకు హాజరు కాని 15 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల శిక్షణకు హాజరు కాని 15 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి తాఖీదులు జారీ చేసినా సరైన వివరణ ఇవ్వనందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సస్పెండైన వారిలో ఐదుగురు పీవోలు, ఏపీవోలు, పది మంది ఓపీఓలు ఉన్నారు. దశరథ్(లోనికలాన్, మునిపల్లి), మల్లేశ్వరి(మల్కాపూర్, కొండాపూర్), యేసుపాదం(పటాన్చెరు), విజయ్కుమార్(నల్తూరు, జిన్నారం), సావిత్రి(వైఎస్ఆర్ కాలనీ, బొల్లారం), సవిత (ఎన్కెముర్రి, కంగ్టి), శ్యామల(లస్కరితండా, నాగల్గిద్ద), రాధాదేవి( చింతల్చెరు, హత్నూర), స్వప్న (బిలాల్పూర్, కోహీర్), రామకృష్ణాచారి (వెలిమల, రామచంద్రాపురం), పాండు (కసబ్గల్లి, జహీరాబాద్), శ్రీనివాస్(కొడిపాక, హత్నూర), లాల్సింగ్ నాయక్ (పీపడ్పల్లి, రాయికోడ్), శ్రీశైలం(రంజోల్, జహీరాబాద్), విజయ్భాస్కర్ (బస్వాపూర్, ప్కుల్కల్)లు సస్పెండైన వారిలో ఉన్నట్లు డీఈవో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు