12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
హుస్నాబాద్, న్యూస్టుడే: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. గురువారం రాత్రి హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్ సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి గుండు అరగుండు అంటు తనను తిట్టుడు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలు మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. తాను నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశానని మంత్రి, భారాస మాజీ ఎంపీ అంటున్నారన్నారు. కరీంనగర్ నియోజకవర్గానికి ఐదేళ్లలో రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. జాతీయ రహదారుల పనులు ప్రారంభించామని చెప్పారు. ఐదేళ్లలో తనపై 109 కేసులు పెట్టారని, రెండుసార్లు జైలుకు వెళ్లానన్నారు. ఇక్కడి మంత్రికి రాజకీయ గురువు చొక్కారావని ఆయన ఓటమికి కారకుడైన నేత కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించారన్నారు. ఎమ్మెస్సార్, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్ను ఓడగొట్టిన వారికి టికెట్ ఇచ్చారన్నారు. భారాస అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్కుమార్ స్థానికుడు కాదన్నారు. పక్క జిల్లాకు చెందిన వాడు కాబట్టి ఇక్కడి రహదారులు, ఇతర అభివృద్ధిగురించి, గౌరవెల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. తాను పక్కా లోకల్ కనుక ప్రజల వెంట ఉంటానన్నారు. హుస్నాబాద్ కేంద్రంగా తన వీడియోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
పదేళ్లపాటు దేశం సుభిక్షం
దుబ్బాక, న్యూస్టుడే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా ప్రభుత్వ పాలనతో పదేళ్లపాటు దేశం సుభిక్షంగా ఉందని మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసలు ఒకటేనని చెప్పారు. గురువారం మండలంలోని హబ్షీపూర్ నుంచి దుబ్బాక వరకు భాజపా శ్రేణులతో నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీ, అనంతరం నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొని, పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద మాట్లాడారు. దుబ్బాకలో చెల్లని నాణెం మెదక్లో ఎలా చెల్లుతుందని కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు కామారెడ్డిలో చెల్లని కేసీఆర్ అనే రూపాయి రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు.గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన కంపెనీ డబ్బును పోలీస్ వాహనాల్లోనే తరలించి, విచ్చలవిడిగా పంపిణీ చేసినట్లు అంగీకరించిన రాధాకిషన్రావును అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు కావడంతోనే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటును అమ్ముకొని భవిష్యత్తు పాడుచేసుకోవద్దని ఓటర్లకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు