ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
పట్టు నిలుపుకొనేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యేలు
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్: పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాంగ్రెస్కు చెందిన నలుగురు, భారాసకు చెందిన ఇద్దరితో పాటు భాజపాకు చెందిన ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేలా ముందుకెళ్తున్నారు.
ఎవరికివారే ప్రత్యేక వ్యూహాలు
- ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లోక్సభ ఎన్నికలను రెఫరెండంగా ప్రకటించి సొంత నియోజకవర్గాల్లో మెజారిటీ తెప్పించే బాధ్యతలను ఎమ్మెల్యేలపైనే మోపారు. కాంగ్రెస్కు చెందిన ఎల్లారెడ్డి, జుక్కల్, అందోలు, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరిస్తున్నారు. గ్రామాల వారీగా పార్టీల బలాబలాలను సమీక్షిస్తూ వ్యూహాలను రచిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు.
- అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లను మించి.. పార్టీ అభ్యర్థికి మెజారిటీ సాధించాలని నియోజకవర్గ బాధ్యులకు భాజపా నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించాలనే లక్ష్యంతో భాజపా ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు రెండింతల మెజారిటీ సాధించాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించినట్లు సమాచారం.
- కామారెడ్డిలో బస్సుయాత్ర చేపట్టిన భారాస అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను గెలిపించాల్సిన ఆవశ్యకతను బాన్సువాడ, జహీరాబాద్ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్రెడ్డి భారాస నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టు నిలుపుకొనేందుకు పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయన కుమారులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జహీరాబాద్లో సైతం ఎమ్మెల్యే గ్రామాల వారీగా ప్రచారం చేపడున్నారు. మైనార్టీ ఓటర్లను కలుస్తూ భారాస హయాంలో చేసిన మేలును వివరిస్తూ మద్దతు కోసం యత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు