343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు
శివ్వంపేట మండలం కొత్తపేటలో..
న్యూస్టుడే-మెదక్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ రోజున ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీస్, ఇటు ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టనున్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, కేంద్ర బలగాల బందోబస్తు, సూక్ష్మ పరిశీలకుడి సమక్షంలో పర్యవేక్షణ చేయనున్నారు.
గజ్వేల్ సెగ్మెంట్లో అత్యధికం
మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,124 పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గత అసెంబ్లీ లేదా ఇదివరకు ఎన్నికలు జరిగిన పోలింగ్ కేంద్రాల్లో గొడవలు, అల్లర్లను దృష్టిలో ఉంచుకొని వాటిని అధికారులు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వాటిపై పోలీస్శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పార్లమెంట్ పరిధిలో 343 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇందులో గజ్వేల్ సెగ్మెంట్లో అత్యధికంగా 69 ఉన్నాయి. ఆ తర్వాత నర్సాపూర్లో 54.. అతి తక్కువగా సిద్దిపేట సెగ్మెంట్లో ఉన్నాయి. సమస్యాత్మక కేంద్రాల పరిధిలో పాత నేరస్థులను బైండోవర్ చేయడంతో పాటు వారి కదలికలపై ప్రత్యేక నిఘాపెట్టారు.
నిశిత పరిశీలన... సాధారణ పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని నియమించనున్నారు. ఇక్కడ కేంద్రం లోపల ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పోలింగ్ రోజున ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. ఆయనతో పాటు కేంద్రం లోపల, బయట రెండు సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టనున్నారు. ఇక శాంతిభద్రతలపరంగా 144 సెక్షన్ విధించనున్నారు. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే... అక్కడికి త్వరగా చేరుకునేందుకు ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికే ఆయా జిల్లాల్లో కేంద్ర బలగాలు చేరుకున్నాయి. ప్రజల్లో ధైర్యం నింపేందుకు పట్టణాలు, మండల కేంద్రాల్లో బలగాలు కవాతు నిర్వహించాయి. పోలింగ్ రోజున ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే దానిపై ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్ సిబ్బందికి సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు