నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి.
365బీ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యం
చేర్యాల పట్టణం ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలో గుంతలో పడబోయిన కారు
న్యూస్టుడే, చేర్యాల: ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మీదుగా దుద్దెడ క్రాస్రోడ్డు నుంచి జనగామ జిల్లా కేంద్రం వరకు సాగుతున్న 365బీ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇలాగే సాగుతున్నాయి. రూ.300 కోట్లతో చేపట్టిన ఈ పనులపై నిర్లక్ష్యం వహించడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం ముందస్తు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదు. కొన్నిచోట్ల అసంపూర్తి పనులను అలాగే వదిలేశారు. పూర్తయిన చోట చక్కగా ఉందనుకుంటే వేగంగా వెళ్తే.. ప్రమాదంలో కాలేసినట్లే. ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు.
నిబంధనలు పాటించక..: పనులు జరిగే చోట హెచ్చరిక, రహదారి మళ్లింపు సూచికలు, అవసరం ఉన్న చోట ఇసుక బస్తాలు అడ్డుగా ఉంచాలి. కల్వర్టు నిర్మాణానికి సుమారు పది అడుగుల గుంతలు తీసిన ప్రాంతంలోనూ హెచ్చరికలు కరవయ్యాయి. ఆయా చోట్ల పలువురు పడిపోయి గాయపడ్డారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన పి.రాజు కారు ఫిబ్రవరి 10న చేర్యాలకు వస్తూ పట్టణంలో ప్రయాణప్రాంగణం సమీపంలో తీసిన గుంతలో పడిపోయింది. రాజు గాయాలతో బయటపడ్డారు. ఇటీవల రాత్రి వేళ రహదారిపై విభాగిని ఉన్నట్లు సూచికలు లేకపోవడంతో ఓ లారీ పైకి ఎక్కేసింది.
యమ‘కంకరలు’: చేర్యాల మండలం దొమ్మాట గ్రామానికి చెందిన చల్లా లక్ష్మి.. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సామగ్రి కోసం అదే గ్రామానికి చెందిన బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. కంకర కుప్పలను చదును చేస్తున్న డోజర్ వెనక్కి వెళ్తూ.. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని డీకొట్టింది. లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ నెల 13న రాత్రి లెనిన్నగర్ శివారులో అమ్మ మందుల కోసం వెళ్లి మహ్మద్ యాకుబ్.. కల్వర్టు గోడకు వాహనంతో ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. చేర్యాల మండలం దానంపల్లికి చెందిన రామ్మూర్తి.. చేర్యాల శివారు గుర్జకుంట వాగు సమీపంలో రోడ్డుపై పడిపోయి గాయపడ్డాడు. రహదారి విస్తరణలో రోడ్డు సగభాగం పాత బీటీని తొలగించడంతో వాహనం అదుపుతప్పింది.
తగు చర్యలు తీసుకుంటాం..: కిరణ్, డీఈ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ
కొన్ని చోట్ల హెచ్చరిక సూచికలు ఏర్పాటుచేశాం. ఇక నుంచి పనులు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. రహదారి విస్తరణ జరుగుతున్న చోట వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగంగా పనులు జరిగేలా చొరవ చూపుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు శిథిలం..వానొస్తే కష్టం
[ 16-06-2024]
ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి సకాలంలో మరమ్మతులూ చేయడం లేదు. -
రుణమాఫీ అంటూనే వసూళ్లకు వేధింపులా?
[ 16-06-2024]
ఒకవైపు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే.. మరోవైపు వసూళ్లకు రైతులను వేధించడమేంటని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. -
వసతిగృహాలు... విద్యా లోగిళ్లు
[ 16-06-2024]
ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. పాఠశాలల్లో విద్యతోపాటు వసతిగృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, పుష్టికరమైన భోజనాన్ని అందిస్తోంది. -
పత్తికి దక్కేనా గిట్టుబాటు ధర!
[ 16-06-2024]
పత్తి పంటకు గిట్టుబాటుపై రైతులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ సీజన్లో పంట చేతికొచ్చే నాటికి క్వింటా ధర రూ.7200 పలికే అవకాశమున్నట్లు ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాయలం ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఇంటిలిజెన్స్ ప్రకటించింది. -
ఆన్లైన్పై అవగాహన కరవు
[ 16-06-2024]
ఇంటర్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశాల విధానంపై పీటముడి నెలకొంది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం వచ్చినా మ్యానువల్గానే పొందుతున్నారు. -
సాగు తగ్గి.. ధరలు పెరిగి..
[ 16-06-2024]
సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారమే మందు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు వీలుగా భోజనంలో నిత్యం కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. -
వ్యవసాయంలో వాతావరణ పాత్ర కీలకం
[ 16-06-2024]
వ్యవసాయ రంగంలో వాతావరణ పాత్ర చాలా కీలకమైందని, అందుకనుగుణంగా పంటల సాగు సరళిని మార్చినప్పుడే సత్ఫలితాలు సాధ్యమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ ఆర్.ఉమారెడ్డి, రాష్ట్ర వాతావరణ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎస్.జి.మహదేవప్ప స్పష్టం చేశారు. -
కన్నకొడుకే కాలయముడు
[ 16-06-2024]
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం
[ 16-06-2024]
ప్రతిభావంతులైన విద్యార్థులు చదువును మధ్యలో ఆపేయకుండా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. -
వారధి.. ఎందుకింత నెమ్మది?
[ 16-06-2024]
మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు చేరాలంటే రవాణా మార్గం కీలకం. ఆ మార్గాల్లో వారధుల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల ఇక్కట్లు వర్ణానాతీతంగా మారాయి. -
బాలుడిని లోబర్చుకున్న వివాహితపై పోక్సో కేసు
[ 16-06-2024]
బాలుడిని లోబరుచుకున్న వివాహితపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. -
ప్రారంభమైన తరగతులు.. అందని పుస్తకాలు
[ 16-06-2024]
ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది పేద విద్యార్థులే. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల భారం భరించే స్థోమత లేకపోవడమే దీనికి కారణం. -
పల్లెల్లో సమస్యల తిష్ఠ
[ 16-06-2024]
గ్రామీణ ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీలకు నిధుల కొరతతో ఏ పనులూ చేయలేని పరిస్థితి నెలకొంది. -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: కలెక్టర్
[ 16-06-2024]
జలాశయాల నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. -
కేసీఆర్ కనిపించడం లేదని ఠాణాలో ఫిర్యాదు
[ 16-06-2024]
ఓట్లు వేసి గజ్వేల్ ప్రజలు మూడోసారి కేసీఆర్ను గెలిపిస్తే ఆయన కనిపించడం లేదని భాజపా నాయకులు శనివారం గజ్వేల్లో నిరసన తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి
-
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి: జె.శ్యామలరావు
-
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 11వ ఘటన