ప్రకటించేశారు.. పరిహారం
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటూ ఉత్తర్వులూ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 10,988 మంది బాధిత రైతులకు కొంత ఊరట లభించినట్లైంది.
సీఎం హామీతో పంట నష్టపోయిన రైతులకు ఊరట
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరిపైరు
ఈనాడు, నల్గొండ : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటూ ఉత్తర్వులూ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 10,988 మంది బాధిత రైతులకు కొంత ఊరట లభించినట్లైంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పంటనష్టం వివరాలతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ప్రకారం వరి, మామిడితో పాటూ అన్ని పంటలు కలిపి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాలు, నల్గొండలో 1060 ఎకరాలు, యాదాద్రిలో 7643 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తేల్చారు. దీని ప్రకారం ఉమ్మడి జిల్లాలో 23,132 ఎకరాలకు ప్రభుత్వం రూ.23.1 కోట్లను పరిహారంగా చెల్లించనుంది. అయితే మొత్తం పంటనష్టం రూ.100 కోట్ల వరకు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఏటా ఈ సీజన్లో వచ్చే అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దిగుబడి తగ్గడంతో పాటూ ఏటా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. గత ఐదేళ్లలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడం ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రథమం. అధికారులు అత్యధికంగా నష్టపోయిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేశారని, 50 శాతం కంటే తక్కువగా నష్టపోయిన వివరాలను నమోదు చేయలేదని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వానల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, తమకూ న్యాయం చేసేలా అధికారులు చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
వరి పంటకే ఎక్కువ నష్టం
మూడు జిల్లాల్లోనూ ఈ అకాల వర్షాల వల్ల అత్యధిక నష్టం వరి పంటకే జరిగింది. 10,988 మంది రైతులకు సంబంధించి 23 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే అందులో 20 వేల ఎకరాలు కేవలం వరి పంటనే కావడం గమనార్హం. పంట దెబ్బతిన్న రైతులకు నాలుగైదు రోజుల్లో పరిహారం ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలిసి వీటిని పంపిణీ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు