యశస్వి.. భవితకు దిక్సూచి
పాఠశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాయి. తాజాగా ప్రగతి పత్రాలను కూడా అందుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
ప్రతిభ చూపితే ఉపకారవేతనం..
ఎనిమిదో తరగతి పూర్తిచేసిన వారికి అవకాశం
రాజపేట, భువనగిరి, న్యూస్టుడే: పాఠశాల విద్యార్థులు పరీక్షలు ముగిశాయి. తాజాగా ప్రగతి పత్రాలను కూడా అందుకున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సెలవుల్లో చదువుకు సానబెట్టి ప్రతిభ చూపి ఉపకార వేతనం పొంది ఆర్థిక అవసరం తీర్చుకునే మంచి తరుణం ఇది. ‘పీఎం యశస్వి’ ఉపకార వేతన పథకం పేర కేంద్ర సర్కారు గతేడాదే రూపకల్పన చేసింది. యశస్వి అంటే ‘యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా’. ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద ఉపకార వేతన పథకాల్లో ఇది కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈ పథకం నడుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1100 ఉన్నత పాఠశాలలుంటే ఎనిమిది, తొమ్మిది, పదోతరగతిని ఇటీవలనే పూర్తి చేసుకున్నవారు సుమారు 82,273 మంది విద్యార్థులున్నారు.
అర్హులు ఎవరంటే..?
విద్యార్థి భారతీయుడై ఉండి, కేంద్ర విద్యాశాఖ అధికారిక ఎన్టీఏ వెబ్సైట్లో నిర్వహించే యశస్వి ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎనిమిదో తరగతి పూర్తయి ఉండాలి. 9, 10 తరగతులు పూర్తయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి మిగిలిన సంవత్సరాలకు (ఇంటర్ వరకు) మాత్రమే ఉపకార వేతనం లభిస్తుంది. సదరు విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించొద్దు. గ్రామాల్లోని నిరుపేదలు, రైతులు, అణగారిన కుటుంబాల్లోని విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
దరఖాస్తు ఇలా చేయాలి...
ప్రవేశ పరీక్ష రాసేందుకు ఎన్టీఏ వెబ్సైట్లో పేరు నమోదు కావాలి. పేరు, ఈ- మెయిల్ అడ్రస్, పుట్టిన తేదీ, పాస్వర్డ్ తదితరాలతో ఓ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దరఖాస్తుదారుడికి అప్లికేషన్ నంబర్ వస్తుంది. అదే వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. చదువు, గుర్తింపుకార్డు తదితర వివరాల డాక్యుమెంట్ల సాఫ్ట్కాపీలను అప్లోడ్ చేసి సైన్అప్ కావాలి. అంతటితో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. పరీక్ష, ప్రవేశకార్డు జారీచేసే తేదీ తదితర వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష ఈ విధంగా..
ఎంపిక చేసిన కేంద్రాల్లో మూడు గంటలపాటు కొనసాగే పరీక్షలను హిందీ, ఇంగ్లిషు భాషల్లో నిర్వహిస్తారు. ఎలాంటి పరీక్ష రుసుం ఉండదు. పత్రంలో వంద బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. గణితంలో 120 మార్కుల కోసం 30 ప్రశ్నలు, సైన్స్లో 80 మార్కులకు 20 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్లో 100 మార్కులకు మరో 25 ప్రశ్నలుంటాయి. దేశ వ్యాప్తంగా సుమారు 78 నగరాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. గతేడాది సెప్టెంబరు 11న పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి ఈ ఏడాది నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 26తో దరఖాస్తు గడువు పూర్తి కానుంది.
అర్హత సాధించిన అనంతరం..
9, 10 తరగతులకు ఏటా రూ.75 వేలు, ఇంటర్మీడియట్ లేదా 11, 12 తరగతులకు ఏటా రూ.1.25 లక్షలు ఉపకార వేతనం ఒకేసారి సంబంధిత ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు ఎంపికైన విద్యార్థులు ఉపకార వేతనం కోసం తిరిగి అదే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంకు ద్వారా పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు పాసుపుస్తకం ఫొటోకాపీని జతచేయాలి. ఉపకారవేతనం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వీటితో కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ పాఠశాల, కళాశాలలో అయినా విద్యార్థులు విద్యను అభ్యసించవచ్చు. ఆ పాఠశాలల వివరాల లింకు కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!