విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో స్లీపర్ క్లాస్ బోగీల కుదింపు
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నిరుపేదలకు, కూలీలకు అనుకూలంగా ఉండే రైలు.
విశాఖ ఎక్స్ప్రెస్ రైలు
సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం మిర్యాలగూడ, న్యూస్టుడే: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వరకు ప్రతిరోజు నడుస్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలు నిరుపేదలకు, కూలీలకు అనుకూలంగా ఉండే రైలు. స్లీపర్ క్లాస్ బోగీలను కుదించడం వాటి స్థానంలో ఏసీ బోగీలను పెంచడంతో సామాన్య ప్రయాణికులపై మూడొంతుల భారం పడుతోంది. మొదట్లో సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్టణం వరకు మాత్రమే విశాఖ ఎక్స్ప్రెస్ రైలు 17015, 17016 నెంబర్లపై నడిచేది. ఆ తరువాత కొంతకాలానికి భువనేశ్వర్ వరకు పొడిగించారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ఉపాధి కోసం వచ్చే ఒడిశా కూలీలకు ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంది. గతంలో విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో 11 స్లీపర్ క్లాస్ , మూడోతరగతి ఏసీ బోగీలు మూడు, రెండోతరగతి ఏసీ బోగీలు రెండు, నాలుగు జనరల్ బోగీలు, దివ్యాంగుల బోగీ, మహిళల ప్రత్యేక బోగీలు ఉండేవి. ఈఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఎల్హెచ్బీ ( లింక్ ఆఫ్మన్ బుష్) బోగీలు ప్రారంభించారు. ప్రయాణ సమయం తగ్గించడంతో పాటుగా వేగం పెంచేలా వీటిని ఏర్పాటు చేశారు. ఎల్హెచ్బీ బోగీల మార్పు తరువాత ప్రస్తుతం విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో 3 స్లీపర్ క్లాస్, 10 మూడోతరగతి ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్కు స్లీపర్ క్లాస్ టిక్కెట్ రూ.525 కాగా మూడోతరగతి ఏసీ రూ.1405 ఉండగా స్లీపర్ క్లాస్ లభించని వారు మూడోతరగతి ఏసీ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండగా ఒక్కొక్కరిపై మూడొంతుల భారం పడుతుంది.
* ప్రధానంగా ఒడిశా నుంచి నిత్యం ఐదువందల మందికి పైగా కార్మికులు తెలంగాణ, ఏపీలోని ఆయా ప్రధాన నగరాలకు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ పట్టణం, మిర్యాలగూడ) ఉపాధికోసం వస్తున్నారు. రెండునెలలు పనిచేసి తిరిగి వెళ్లటం, మరో రెండునెలల విశ్రాంతి తరువాత తిరిగి పనులకు వస్తుంటారు. అందుకే విశాఖ, ఫలక్నుమా రైళ్లలో ఎక్కువ మంది ఒడిశా కార్మికులు నిత్యం ప్రయాణిస్తుంటారు. వీరంతా తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బడుగుల రైలును ధనికులకు అనుకూలంగా రైల్వేశాఖ అధికారులు మార్చిన తీరుపై నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్లీపర్ క్లాస్ బోగీలను పెంచి నిరుపేద, మద్యతరగతి ప్రజలపై భారం తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా