విసుగు చెందేలా.. వింత శబ్దాలు
నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక వింత శబ్దంతో చిరాకు తప్పడం లేదు. మైకుల మోత, రాజయ నాయకుల ఊరేగింపులు, కూరగాయల నుంచి పాతసామాన్లు కొనేవారు, ఐస్క్రీమ్ బండ్లవారు, మున్సిపల్ చెత్తసేకరణ కోసం వాడే మైకులు, డీజే శబ్దాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.
నీలగిరి, న్యూస్టుడే: నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒక వింత శబ్దంతో చిరాకు తప్పడం లేదు. మైకుల మోత, రాజయ నాయకుల ఊరేగింపులు, కూరగాయల నుంచి పాతసామాన్లు కొనేవారు, ఐస్క్రీమ్ బండ్లవారు, మున్సిపల్ చెత్తసేకరణ కోసం వాడే మైకులు, డీజే శబ్దాలతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇక కొందరు ఆకతాయిలు తమ వాహనం సైలెన్సర్, హారన్ మార్చి రయ్ మంటూ దూసుకెళ్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. వింత శబ్దాలు చేస్తున్న వాహన దారులపై పోలీసులు కేసులు నమోదు, జరిమానాలు విధించినా.. వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. మానవుడు సాధారణంగా 90 డెసిబుల్స్ లోపు శబ్దం వింటే ఏ సమస్య ఉండదు. కానీ.. అంతకు మించి తరచూ వింటే వినికిడి సమస్యతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పోలీసులు పట్టుకున్నా ..
వింత శబ్దాలతో వాహనాలు నడిపేవారిని తనిఖీలలో పోలీసులు పట్టుకుని జరిమానా విధిస్తున్నారు. వారిలో మార్పు రాకుండా రెండో సారి కూడా దొరికిపోతే కుటుంబ సభ్యులను పిలిచి హెచ్చరిస్తున్నారు. అయినా.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. వాహనాల నుంచి వచ్చే శబ్దం విపరీతంగా ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు వింత శబ్దాలు వింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు ïాచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఆనందం కోసం వాహనాలకు వింత శబ్దం ఏర్పాటు చేసుకునేవారు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం.. సురేశ్రెడ్డి, ఆర్టీవో
వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అవగాహన కల్పిస్తున్నాం. సంస్థ నుంచి ఏర్పాటు చేసిన విధంగా సైలెన్సర్, హారన్ ఉండాలని.. వాటిని ఎలాంటి మార్పులు చేసినా చట్టపరంగా రూ.2వేల జరిమానా విధిస్తాం. రెండో సారి కూడా అలాగే వ్యవహరిస్తే వారిని పోలీసులు అప్పగిస్తే ఆ వాహనాన్ని సీజ్ చేస్తాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు...
నాగదుర్గాప్రసాద్, సీఐ, రెండో పట్టణ పోలీస్స్టేషన్, నల్గొండ
ఇంత శబ్దాలు వచ్చేలా రెండు హారన్లు, సైలెన్సర్ మార్చితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డీజేలకు అనుమతి లేదు, వ్యాపారులు మైక్ల సౌండ్ తగ్గించి అమ్ముకోవాలి. శబ్ద కాలుష్యానికి కారణమైన వారిపై జరిమానా విధిస్తున్నాం.
90 డెసిబుల్స్ దాటితే వినికిడి కోల్పోతారు
డాక్టర్ ఇమ్మానియల్, చెవి ముక్కు గొంతు స్పెషలిస్టు
వింత శబ్దాలు నిరంతరం వింటే వినికిడి శక్తిని కోల్పోయి మానసిక సమస్యలు వస్తాయి. 90 డెసిబుల్స్కు మించి శబ్దం వినొద్దు. చిన్నపిల్లలు పాఠశాల బస్సు హారన్ శబ్దం ఎక్కువ సేపు విన్నా ఇబ్బంది పడతారు. ఇయర్ పోన్లు నిరంతరం వాడితే వినికిడి సమస్య వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!