సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు.
జిల్లాలో 26 మంది నియామకం
సూర్యాపేటలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్, సూర్యాపేట: చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాల పేరిట ఎర వేస్తున్న నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. వీరి ఆగడాలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సదస్సులు, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో బాధితులకు మరిన్ని సేవలందించేందుకు సైబర్ వారియర్స్ పేరిట సిబ్బందిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
వారియర్ సేవలు ఇలా..
సైబర్ నేరాల బారిన పడిన బాధితులు టోల్ ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేస్తున్నారు. ఘటన చోటుచేసుకున్నాక ఎంత త్వరగా సమాచారం ఇవ్వగలిగితే అంత వేగంగా నేరాన్ని నియంత్రించేందుకు వీలవుతుంది. నేరాలు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బాధితులు టోల్ ఫ్రీ నంబరును ఆశ్రయిస్తున్నారు. అక్కడ కాల్స్ ఎక్కువ కావడంతో అక్కడ సహాయ కేంద్రాల సంఖ్యను పెంచారు. అయినా విపరీతమైన ఫోన్కాల్స్ వస్తుండటంతో బాధితులకు సత్వరం, మేలైన సేవలు అందించేందుకు ఎంపిక చేసిన పోలీస్ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ వారియర్స్ సిద్ధం చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి కేసులున్నా..ఈ వారియర్స్ను సంప్రదిస్తే వారు ఎన్సీఆర్పీ(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్)లో వివరాలు నమోదు చేస్తారు. ఇప్పటికే నమోదైన కేసుల ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తారు. ఎవరైనా 1930కు కాల్ చేస్తే.. బాధితుల సమీపంలోని పోలీస్స్టేషన్ పరిధిలో గల సైబర్ వారియర్స్కు సమాచారం చేరుతుంది. వారే బాధితులను పోలీస్స్టేషన్కు పిలిపించుకుని లేదా ఫోన్లోనే మాట్లాడి సహాయం అందిస్తారు.
ఠాణాకో ఫోన్నంబరు
ప్రతి పోలీస్స్టేషన్కు ఒక సైబర్ వారియర్ను నియమించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ రకాల పోలీస్స్టేషన్లు 26 ఉన్నాయి. వాటి పరిధిలో సైబర్ విభాగంలో అవగాహన కలిగిన సిబ్బందికి హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అవసరమైన శిక్షణ అందించారు. అందరికీ ప్రత్యేకంగా సిమ్కార్డులు, ఫోన్ అందించారు. పోలీస్స్టేషన్ల వారీగా ఆ నంబర్లు అందరికీ తెలిసేలా ప్రచారం చేపట్టనున్నారు.
ప్రజలు వినియోగించుకోవాపజలు వినియోగించుకోవాలి
- రాహుల్ హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట
సైబర్ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే జిల్లాలో సైబర్ వారియర్స్ను నియమించాం. ప్రజలు సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలి. బాధితులు వారియర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిదారులే తెరుచుకున్నాయ్!
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2022-23 రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం తీసుకుని కోట్ల రూపాయల బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. -
గుర్తుల గుబులు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం ముగియడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. -
శిక్షణకు సిద్ధం
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండో విడత శిక్షణ కార్యక్రమం ఈ నెల 2 నుంచి 4 వరకు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. -
ఓట్ల ఆధారంగానే పార్టీలకు గుర్తింపు
[ 02-05-2024]
మనం తరచూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు అంటూ వింటుంటాం. ఎన్నికల సమయంలో నేతలు ఎక్కువగా వీటిని ప్రస్తావిస్తుంటారు. జాతీయ పార్టీలు అంటే దిల్లీ కేంద్రంగా పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీలు స్థానిక సమస్యలను పరిష్కరిస్తుంటాయని చెబుతుంటారు. -
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ
[ 02-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
సినీ ఫక్కీలో ఎల్లయ్య హత్య
[ 02-05-2024]
గత నెల 19న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు వచ్చి అదృశ్యమైనట్లు కేసు నమోదైన సూర్యాపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్యను కొంతమందితో కలిసి హత్య చేసినట్లు సూర్యాపేట జిల్లాకు చెందిన తాడూరి శ్రీకాంతరాజు (చారి) ఒప్పుకొన్నారు. -
పోలీసులకూ అనుమతి లేదు సుమా..!
[ 02-05-2024]
మొత్తం ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలకపాత్ర. దాదాపు ఎన్నికల ప్రక్రియలో అన్ని చోట్లా వారి జోక్యం ఉంటుంది. ఎన్నికల ప్రచారాలకు, సభలకు, ర్యాలీలకు వారి అనుమతులు తప్పనిసరి. -
ఎండ వేఢీ.. చిక్కని ఓటరు నాడి
[ 02-05-2024]
శారీరక శ్రమకు అలవాటు పడి.. ప్రతి నిత్యం పనిలో నిమగ్నమై.. స్వేదం చిందించే కార్మికులను, కర్షకులను సైతం ఈ ఏడాది ఎండలు హడలెత్తిస్తున్నాయి. -
ఆయుధాలు అప్పగించారు..!
[ 02-05-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
ఆరో తరగతిలో వేయి పడగలు నవల చదివా
[ 02-05-2024]
మాది భువనగిరి. 12వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆరో తరగతి చదివే రోజుల్లో వేసవి సెలవులొస్తే స్నేహితులు యంజాల గోపాల్, బుద్దగిరి లక్ష్మీనర్సయ్య, చల్ల కృష్ణలతో కలిసి నార్ఖాన్ బావికి ఈతకు వెళ్లేవాళ్లం. -
నీలగిరి.. నిప్పుల కొలిమి!
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారుతోంది. రోజురోజుకీ రాష్ట్రంలోనే అత్యధికంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
[ 02-05-2024]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ తెలిపారు. -
పేరు చెప్పనందుకు ఓటు కట్
[ 02-05-2024]
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక 1951లో ఓటర్ల నమోదు చేపట్టారు. అప్పట్లో 21 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించింది. -
పోలింగ్ కేంద్రాల్లో అధికారుల నంబర్లు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
18 ఏళ్లకు ఓటుహక్కు ఎప్పుడు కల్పించారంటే..!
[ 02-05-2024]
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కును వినియోగించుకునేవారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?