విభజన హామీల అమలుకు కృషి
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు.
చామల కిరణ్కుమార్రెడ్డి
నామినేషన్ అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్, ఎమ్మెల్యేలు వీరేశం, అనిల్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యే మందుల సామేల్
భువనగిరి, న్యూస్టుడే: భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి బుధవారం కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే.జెండగేకు తన నామపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. ప్రధానంగా జిల్లాలను పట్టిపీడిస్తున్న మూసీ కాలుష్య ప్రక్షాళనకు నిధుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాన్నారు. గంధమళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కృషి చేయడంతో పాటు బస్వాపూర్ జలాశయం పనులు వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీలోపు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం శ్రీలక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి చెబితే భాజపా, కాంగ్రెస్లు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్పై కుట్రపూరిత విమర్శలు, ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ తాను మంజూరు చేయించాని భాజపా అభ్యర్థి నర్సయ్య గొప్పలు చెప్పుకుంటున్నారని, అక్కడ నిమ్స్ ఏర్పాటు చేసింది దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ అని, అక్కడ భవనాలు నిర్మించకుంటే ఎయిమ్స్ వచ్చేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ సర్కార్ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. భారాస రాష్ట్రంలో ఎక్కడా లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, సామ మధుసూదన్రెడ్డి, పోత్నక్ ప్రమోదక్కుమార్, పంజాల రామాంజనేయులు గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, బీసుకుంట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!