తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి.
భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్కానింగ్ కోసం బారులు తీరిన గర్భిణులు
భువనగిరి, భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. నెలకు భారీగా వేతనాలు తీసుకుంటున్నా.. ప్రైవేట్లో ప్రాక్టీస్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. స్కానింగ్ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చే గర్భిణులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రతి రోజు సుమారుగా 100 మంది వరకు గర్భిణులు పరీక్షల కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తుంటారు. స్పెషలిస్టుల సూచనల మేరకు నెలనెలా స్కానింగ్ చేసి గర్భంలోని శిశు పరిస్థితి గమనిస్తారు. సదరు ఉద్యోగి ఇక్కడ కొంత మందిని పరీక్షించిన తరువాత మధ్యలో బయటకు వెళ్తున్నట్లు సమాచారం. మిగిలిన వారిని ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ల్యాబ్కు వస్తే అక్కడ స్కానింగ్ చేస్తానని బహిరంగంగానే చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్కడ రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. నిరీక్షించే ఓపిక లేక సిబ్బందిని అడిగితే డాక్టర్ ఎదురుగా ఉన్న ల్యాబ్లో ఉంటారు. అక్కడకు వెళ్లాలని సూచిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్కానింగ్ కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణులు గంటల తరబడి నిరీక్షించి స్టాఫ్ నర్స్తో గొడవకు దిగారు. ఈ విషయాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీశైల చిన్నానాయక్ దృష్టికి తేగా ఇప్పటి వరకు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. ప్రస్తుతానికి రేడియాలజిస్టు ఒక్కరే విధులు నిర్వరిస్తున్నారని, రోజుకు వందకు పైగా స్కానింగ్లు జరుగుతున్నాయని ‘న్యూస్టుడే’కు వివరణ ఇచ్చారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
డాక్టర్ లేకపోవడంతో ఖాళీగా కనిపిస్తున్న స్కానింగ్ రూం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి