నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు
నాంపల్లి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చిత్రంలో అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి
నాంపల్లి, న్యూస్టుడే: భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి శనివారం రాత్రి నాంపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన జన గర్జన ర్యాలీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేలా కృషి చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. మునుగోడు పరిధిలో చేరికలను అడ్డుకోవద్దని, అందర్నీ సాదరంగా స్వాగతించాలని కార్యకర్తలకు సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాశ్నేత, జడ్పీటీసీ సభ్యుడు ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి, మండల అధ్యక్షుడు కత్తి రవీందర్రెడ్డి, ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పి.సంజీవరెడ్డి, శీలం జగన్మోహన్రెడ్డి, శివారెడ్డి, వెంకన్నగౌడ్, ఎస్కె.చాంద్పాషా, వెంకటయ్య, బి.సుదర్శనాచారి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?