అప్రమత్తతే శ్రీరామరక్ష
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
సరైన రక్షణ కవచాలు లేకుండా ప్రమాదకరంగా పని చేస్తున్న కార్మికుడు
కొండమల్లేపల్లి, న్యూస్టుడే: మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏప్రిల్ 27న కొండమల్లేపల్లిలోని ఓ సామిల్ (కట్టెల మిల్లు)లో జరిగిన విద్యుదాఘాతంతో సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 16.72 లక్షల విద్యుత్తు వినియోగదారులున్నారు. తరచూ ఎక్కడో ఓ చోట విద్యుత్తు ప్రమాదం జరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు విద్యుత్తు అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా నియంత్రికలను సొంతంగా బంద్ చేయడం, స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేసుకోవడం, నియంత్రికల చుట్టూ కంచె లేకపోవడం, ఇళ్లలో ఎర్తు వస్తున్నా.. పట్టించుకోకపోవడం తదితర కారణాల వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.
అధికారుల సూచనలు
- విద్యుత్తు లైన్ల కింద పందిర్లు, జెండాలు కట్టొద్దు.
- ఐఎస్ఐ లేదా ప్రముఖ కంపెనీలకు చెందిన విద్యుత్తు తీగలు, పరికరాలు, పంపులు మాత్రమే వినియోగించాలి. ధర తక్కువ, నాణ్యత, గుర్తింపు లేని వాటిని వినియోగించకూడదు.
- నియంత్రికల ఫ్యూజ్లను విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, అనధికారికంగా మార్చొద్దు.
- సర్వీస్ వైర్లు, విద్యుత్తు వీధి దీపాలను సరి చేసేందుకు ఇతరులు విద్యుత్తు స్తంభాలను ఎక్కకూడదు.
- ఇళ్లలో, కార్యాలయాల్లో తప్పని సరిగా ఎర్తు ఏర్పాటు చేసుకోవాలి.
- ఇంటి ఆవరణలో విద్యుత్తు వైర్లకు సమీపంలో జి.ఐ, ఇనుప తీగలతో కూడిన దండేలు కట్టి వాటిపై తడి దుస్తులు ఆరవేయొద్దు.
- ఏవైనా వస్తువులు విద్యుత్తు తీగలకు చుట్టుకుంటే వాటిని తీసే ప్రయత్నం చేయకూడదు.
అవగాహన కల్పిస్తున్నాం
చంద్రమోహన్, ఎస్ఈ, నల్గొండ
విద్యుత్తు మరమ్మతుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అధికారులు, సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశిస్తున్నాం. అవగాహన లేని వారు స్వతహాగా విద్యుత్ మరమ్మతులు చేసుకోవద్దని సూచిస్తున్నాం.
జిల్లా వినియోగదారుల సంఖ్య
నల్గొండ 7,22,404
సూర్యాపేట 5,26,087
యాదాద్రి 4,24,061
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన