మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రహదారి విస్తరణలో భాగంగా మిర్యాలగూడలో నరికేసిన భారీ చెట్లు (పాత చిత్రం)
మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ప్రజలు అనుభవించని ఎండలను ఈ వేసవిలో చవిచూస్తున్నారు. రికార్డు స్థాయిలో అనేక ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు, వడ గాలులతో అనేక మంది ప్రాణాలు సైతం విడుస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాదే ఎందుకు ఎండలు మండిపోతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
మితిమీరిన కాలుష్యం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలసిన వివిధ పరిశ్రమల కారణంగా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. కాలుష్యం కారణంగా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలో పెరిగిపోవడంతో భూమి వేడెక్కిపోతోంది. గత కొన్నేళ్లుగా ఏటా వాతావరణంలో ఈ వాయువుల ప్రభావం భారీగా పెరుగుతూ వస్తుంది. దీంతో ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మట్టి రహదారులు కనుమరుగు..
అభివృద్ధి పేరుతో గ్రామాల్లో సైతం మట్టి రహదారులు లేకుండా మొత్తం సీసీ రహదారులు ఏర్పాటు చేయడంతో వేడి పెరిగేందుకు ప్రధాన కారణంగా మారుతుంది. దీని వల్ల వర్షపు నీరు, ఇళ్లలో వాడే నీరు భూమిలోకి ఇంకిపోకుండా కాలువల ద్వారా దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. దీనికి తోడు నీటి కోసం ఎడాపెడా బోర్లు తవ్వుతుండడంతో భూగర్భ జలాలు భారీగా పడిపోయి.. వేడి పెరిగేందుకు కారణం అవుతోంది.
ఎడాపెడా చెట్ల నరికివేత..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతూ భారీ రహదారులు ఇటీవల కాలంలో అనేకం వచ్చాయి. వీటి నిర్మాణానికి, రహదారుల విస్తరణకు అడ్డుగా ఉన్న ఏళ్ల నాటి భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. దీని కారణంగా ఉమ్మడి జిల్లాలో అటవీ శాతం సుమారు 5 శాతం పైగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి పేరిట పెద్ద కొండలు, అడవులను చదును చేస్తూ ఉండడంతో వాతావరణ అసమతుల్యం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో అటవీ శాతం సైతం తక్కువగానే ఉంది.
విపరీతంగా ప్లాస్టిక్ వినియోగం..
ఇక వాతావరణ కాలుష్యం పెరగడంలో ముఖ్యమైన మరో కారణం ప్లాస్టిక్ వినియోగం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిషేధిత ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వాడకం మరింత పెరిగిపోయి ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
మనమేం చేయాలి..
- బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి.
- ఎవరికి వారే ప్లాస్టిక్ వినియోగాన్ని త్యజించాలి.
- వాహనాల వినియోగం వీలైనంతగా తగ్గించి.. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలి.
- ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ పొలాల్లో నీరు, విద్యుత్తు వృథాను అరికట్టాలి.
- వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాట్లు చేయాలి.
- ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థపు నీటిని సైతం భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేయాలి.
చెట్లు పెంచడమే ఏకైక మార్గం
రావుల శ్రీనివాస్, పర్యావరణ ప్రేమికుడు, మిర్యాలగూడ
భూతాపాన్ని తగ్గించేందుకు మన వద్ద ఉన్న ఏకైక మార్గం చెట్లను విరివిగా పెంచడమే. లేదంటే భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. చెట్లు పెంచాలనే లక్ష్యంతో పలు ప్రాంతాల్లో ప్లకార్డుతో రోజంతా నిల్చుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. మొక్కలను పెంచేందుకు ముందుకొచ్చే వారికి నేను ఉచితంగా మొక్కలు సరఫరా చేస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన