logo

భాజపా కార్యర్తల ర్యాలీ

భువనగిరి పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపును కాంక్షిస్తూ బుధవారం పట్టణంలో భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 08 May 2024 19:25 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపును కాంక్షిస్తూ బుధవారం పట్టణంలో భాజపా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ చౌరస్తా శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద నుంచి బైక్ ర్యాలీని పార్టీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ప్రారంభించారు. గురువారం భువనగిరిలో జరిగే హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ మాయ దశరథ పార్టీ నాయకులు రత్నపురం శ్రీశైలం, కానుగంటి రమేష్, పంచాద్దుల బలరాం, ఎదవని సంతోష్, ఊదరి సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని