logo

అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి: ఎమ్మెల్యే

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్, విద్యానగర్, బంజారహిల్స్, తారకరామ నగర్, పహాడినగర్‌లో కాంగ్రెస్‌ ప్రచారం చేసింది.

Updated : 09 May 2024 19:48 IST

భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్, విద్యానగర్, బంజారహిల్స్, తారకరామ నగర్, పహాడినగర్‌లో కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి అన్నారు. భాజపా, భారాస నాయకుల మాయమాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు పోట్నక్ ప్రమోద్ కుమార్, నాయకులు గంగ, అవేజ్ చిస్తీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని