logo

జాతీయ లోక్‌ అదాలత్‌ 11న

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని తెలిపారు.

Published : 05 Feb 2023 01:19 IST

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి  యామిని

నెల్లూరు(లీగల్‌), న్యూస్‌టుడే: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో కార్యదర్శి ఎం.శ్రీనివాసుల నాయక్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని తొమ్మిది మండల కేంద్రాల్లో అదాలత్‌ జరుగుతుందన్నారు. రాజీకి ఆమోద యోగ్యమైన అన్ని సివిల్‌, క్రిమినల్‌, మోటారు ప్రమాద, కుటుంబ వివాద కేసులు పరిష్కరిస్తారన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, వివిధ సంస్థల అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఎక్కువ కేసుల పరిష్కారానికి తోడ్పడాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని