logo

మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి

అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 24 Apr 2024 13:53 IST

కావలి: అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  అంతకుముందు బీద సోదరుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుపూరు మహిళలు ఆయనకు మంగళ హారతులివ్వగా..   తెలుగు తమ్ముళ్లు పూల వర్షం కురిపిస్తూ సందడి చేశారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. తెదేపా అధికారంలోకి రాగానే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెదేపాకు ఓటు వేసి తనను గెలపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెదేపా ఎన్నికల ప్రచారానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో  ఇందుపూరు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని