logo

తెదేపాలో చేరిన వాలంటీర్‌తోపాటు వైకాపా నేతలు

పట్టణంలోని 38వ వార్డు, వైకుంఠపురానికి చెందిన వాలంటీర్, పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు.

Published : 04 May 2024 12:53 IST

కావలి: పట్టణంలోని 38వ వార్డు, వైకుంఠపురానికి చెందిన వాలంటీర్, పలువురు వైకాపా నేతలు తెదేపాలో చేరారు. శనివారం కావలి తెదేపా కార్యాలయంలో  38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్, వల్లెపు కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వాలంటీర్ పల్లపు జయశ్రీ, పల్లపు ప్రభాకర్, పల్లపు శివకృష్ణ, పల్లపు సరిత, తన్నీరు మాల్యాద్రి, తన్నీరు కోటేశ్వరమ్మ, కుంచల ప్రవళిక, మల్లి కోటేశ్వరి తదితరులు  తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. వరుస చేరికలతో కావలి నియోజకవర్గంలో తెదేపా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఇంటూరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని