logo

నిరుద్యోగులకు వైకాపా మోసం: ఆనం

జగన్‌ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆత్మకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని గోవిందంపల్లి, పాతాళపల్లి, ముస్తాపురం, వరికుంటపాడు, ఉప్పలపాడు, కమ్మవారిపల్లి, పడమటి కంభంపాడు, సోమశిల, సంజీవ నగరం తదితర గ్రామాల్లో శనివారం ఆనం ఎన్నికల ప్రచారం చేశారు.

Published : 05 May 2024 03:39 IST

యువతతో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం

అనంతసాగరం, న్యూస్‌టుడే: జగన్‌ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆత్మకూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. మండల పరిధిలోని గోవిందంపల్లి, పాతాళపల్లి, ముస్తాపురం, వరికుంటపాడు, ఉప్పలపాడు, కమ్మవారిపల్లి, పడమటి కంభంపాడు, సోమశిల, సంజీవ నగరం తదితర గ్రామాల్లో శనివారం ఆనం ఎన్నికల ప్రచారం చేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిందన్నారు. రైతులు, నిరుద్యోగులను మోసగించిందని తెలిపారు. గ్రామాల్లో కొందరు వైకాపాను వీడి తెదేపాలోకి చేరారు. ఆనం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షురాలు సునీత, భాజపా నేతలు కర్నాటి ఆంజనేయరెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని