వైకాపా నాయకుల ఇసుక దోపిడీ
పెన్నానదిలో విరువూరు ఇసుకరేవు నుంచి అక్రమంగా రూ.కోట్లాది రూపాయల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోమిరెడ్డి
పొదలకూరు, మనుబోలు, న్యూస్టుడే: పెన్నానదిలో విరువూరు ఇసుకరేవు నుంచి అక్రమంగా రూ.కోట్లాది రూపాయల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. శనివారం పొదలకూరు మండలంలోని విరువూరు, ప్రగతినగర్, తాటిపర్తి, నల్లపాళెం, వరదాపురం, ఆనాటికండ్రిక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరులోని సోమిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మనుబోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెదేపాలో చేరారు. కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి, గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్రెడ్డి, కలికి రమేష్రెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడిలో సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 18-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. అందునా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. -
పరుగుల్లో తేజస్సు
[ 18-05-2024]
పరుగు పందెంలో రారాజుగా నిలిచాడు.. ఆ యువకుడు. అథ్లెటిక్స్లో రాష్ట్రంలోనే అందెవేసిన చేయి. అఖిల భారతంలోనే రన్నర్గా నిలిచాడు.. రెండు సంవత్సరాల్లోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ఔరా అనిపిస్తున్నాడు. -
శ్రీవారి పరకామణికి కరెన్సీ లెక్కింపు యంత్రం వితరణ
[ 18-05-2024]
శ్రీవారి పరకామణికి నెల్లూరుకు చెందిన భక్తుడు రూ. 9.33 లక్షల విలువైన కరెన్సీ కౌంటింగ్ యంత్రాన్ని గురువారం విరాళంగా అందించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 18-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?