logo

వైకాపా నాయకుల ఇసుక దోపిడీ

పెన్నానదిలో విరువూరు ఇసుకరేవు నుంచి అక్రమంగా రూ.కోట్లాది రూపాయల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Published : 05 May 2024 03:40 IST

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోమిరెడ్డి

పొదలకూరు, మనుబోలు, న్యూస్‌టుడే: పెన్నానదిలో విరువూరు ఇసుకరేవు నుంచి అక్రమంగా రూ.కోట్లాది రూపాయల ఇసుకను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని సర్వేపల్లి నియోజకవర్గ తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం పొదలకూరు మండలంలోని విరువూరు, ప్రగతినగర్‌, తాటిపర్తి, నల్లపాళెం, వరదాపురం, ఆనాటికండ్రిక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  నెల్లూరులోని సోమిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మనుబోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెదేపాలో చేరారు. కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్‌రెడ్డి, కలికి రమేష్‌రెడ్డి, సాని వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడిలో సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని