స్వచ్ఛత.. నిర్లక్ష్యపు ఘనత
నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడంతో కేంద్రం నగర, పురపాలికలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తోంది. బహిరంగ మలమూత్రŸ విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేది.. ర్యాంకులు ఇవ్వడంలో ఉద్దేశం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం స్వచ్ఛ మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నవి మూతపడినా పట్టించుకోలేదు.
వైకాపా ప్రభుత్వంలో సామూహిక మరుగుదొడ్లకు తాళాలు
న్యూస్టుడే, నెల్లూరు (నగరపాలకసంస్థ), కావలి, ఆత్మకూరు
నెల్లూరులో ఉపయోగంలో లేని స్వచ్ఛ మరుగుదొడ్లు
నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేయడంతో కేంద్రం నగర, పురపాలికలకు స్వచ్ఛ ర్యాంకులు ప్రకటిస్తోంది. బహిరంగ మలమూత్రŸ విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేది.. ర్యాంకులు ఇవ్వడంలో ఉద్దేశం. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం స్వచ్ఛ మరుగుదొడ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉన్నవి మూతపడినా పట్టించుకోలేదు. అంతేకాదు గత తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన వాటికి నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఫలితంగా నగర, పట్టణాలలో బహిరంగ మూత్ర విసర్జన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
5.56 కోట్ల ప్రజాధనం వృథా
నెల్లూరు నగరపాలకసంస్థ అధికారులకు, పాలకులకు ప్రజాధనం అంటే లెక్కేలేకుండాపోతుంది. కోట్ల రూపాయల నిధులను రోడ్డుపాలు చేస్తున్నారు. గుత్తేదారులకు దోచిపెట్టడం తప్ప.. ప్రజలకు ఉపయోగం శూన్యం. నెల్లూరు నగరంలో 54 డివిజన్లు ఉండగా.. జనాభా దాదాపు 10 లక్షలకు చేరుకుంది. వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. వాణిజ్య ప్రాంతం కావడంతో రాకపోకలకు ఎక్కువే. రెండేళ్ల క్రితం రూ.5.56 కోట్లతో 57 ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించి.. మళ్లీ తాళాలు వేసేశారు. మరికొన్ని వివిధ దశల్లోనే ఉన్నాయి. పనులు నిలిపేశారు. కొందరు వ్యక్తులు కొన్ని టాయిలెట్లలోని ట్యాపులను ఎత్తుకుపోయారు. దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటిలో పలు మరుగుదొడ్లకు తాళాలు వేసేశారు. వీటితో పాటు సులభ్కాంప్లెక్స్ల నిర్వహణ కొరవడటంతో దుర్వాసన వస్తున్నాయి. దీంతో నగరంలో బహిరంగ మూత్ర విసర్జన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఆత్మకూరులో నిరుపయోగంగా..
నిర్వహణే సమస్య
ఆత్మకూరు పట్టణంలో సామూహిక మరుగుదొడ్లు లేక వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పురపాలక బస్టాండ్, సోమశిల రోడ్డు సెంటర్, నెల్లూరుపాళెం సెంటర్ ప్రాధానమైనవి. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. పురపాలక బస్టాండ్లో ప్రయాణికులకు ఉచితంగా సేవలు అందించే మరుగుదొడ్డిలేదు. సులభ్ కాంప్లెక్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సోమశిల రోడ్డు సెంటర్లో గతంలో పంచాయతీ వారు నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు ఉండేవి. పురపాలకం ఏర్పడటంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఆ ప్రతిపాదనలు కార్యరూపంలోకి రాకముందే ప్రభుత్వం మారింది. ఆ ప్రయత్నమే పూర్తిగా ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరుపాళెం సెంటర్లో పురపాలకం ఆధ్వర్యంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. కొంత కాలంగా వీటి నిర్వహణపై నిర్లక్ష్యం చూపారు. దెబ్బతిన్నాయనే సాకుతో ఒకవైపు తాళం వేశారు. మరోవైపు ఉన్నా ఉపయోగించలేని విధ]ంగా మారాయి. దాంతో అక్కడ దిగే ప్రయాణికులు అత్యవసరం అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితి.
కావలి.. అక్కరకురాని నిర్మాణం
కావలిలోనూ అంతంత మాత్రమే..
కావలి పట్టణం 17వ వార్డు బుడంగుంట గిరిజన కాలనీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు... ప్రస్తుతం పురపాలక సంఘ నిర్లక్ష్యం కారణంగా అక్కరకు రావడం లేదు. ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులంతా పూరిళ్లలోనే నివసిస్తుంటారు. వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేదు. దీంతో వీటిని నిర్మించడంతోపాటు మోటార్, బోరువంటి వసతులు కల్పించారు. ఆ తరువాత వైకాపా హయాంలో దీనిని పూర్తిగా వినియోగించకుండా అడ్డుకున్నారు. పురపాలక సంఘం నిర్వహణను విస్మరించింది. అక్కడి గిరిజన మహిళలు బహిర్భూమికి ముళ్లపొదల చాటుకు వెళ్తున్నారు. వర్షాలొచ్చినప్పుడు వారి ఇక్కట్లు వర్ణనాతీతం. సామూహిక మరుగుదొడ్లు వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్