ముందస్తు ప్రణాళిక ఏమైంది..?
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇటీవల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాంటా పూర్తయినా ధాన్యం సంచులు కల్లాల్లోనే ఉంటున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు రెండు మూడురోజులపాటు అక్కడే నిరీక్షిస్తున్నాయి.
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇటీవల తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. కాంటా పూర్తయినా ధాన్యం సంచులు కల్లాల్లోనే ఉంటున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు రెండు మూడురోజులపాటు అక్కడే నిరీక్షిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ధాన్యం కుప్పల వద్దే ఉంటున్నారు. దానికి తోడు అకాల వర్షాలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ కొనుగోళ్లను తొలుత వేగంగా కొనసాగించారు. కాని గత పది రోజులుగా ప్రక్రియ మందగించింది. మిల్లుల్లో స్థలం లేదనే కారణంతో రైస్మిల్లర్లు లారీల్లోని ధాన్యాన్ని దించుకోవడం లేదు.
సమీక్షలపై సందేహాలు
ధాన్యం కొనుగోళ్ల సీజన్ రాకముందే అధికారులు రెండు మూడుసార్లు అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు. కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆయా సీజన్లో ధాన్యం దిగుబడులు ఎన్ని వస్తాయో ప్రాథమికంగా అంచనా వేస్తారు. అందుకు తగిన విధంగా రైస్మిల్లుల్లో ధాన్యం నిల్వలకు స్థలం ఉంది లేనిది చూస్తారు. మిల్లులు వారికి గతంలో కేటాయించిన ధాన్యానికి సీఎంఆర్ లక్ష్యాలు పూర్తిచేశారా లేదో ఆరా తీస్తారు. లక్ష్యాలు చేరుకోనివారికి కొత్తగా ధాన్యం కేటాయింపులు కూడా కొన్నిమార్లు ఇవ్వరు. ఎఫ్సీఐ, పౌరసరఫరాలశాఖ గిడ్డంగుల్లో నిల్వల పరిస్థితి గురించి ఆరా తీస్తారు. నిల్వలు ఎక్కువగా ఉంటే ఎఫ్సీఐ వారితో మాట్లాడి బియ్యాన్ని ఖాళీ చేయించడానికి కూడా ఏర్పాట్లు చేయాలి. మిల్లుల్లో స్థలం లేకుంటే పక్కజిల్లాకు కూడా ధాన్యం కేటాయింపులు జరుగుతుంటాయి. కానీ జిల్లాలో మాత్రం వీటిపై సమీక్ష జరిగిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల్లో గత సీజన్ల ధాన్యం, బియ్యం అలాగే ఉన్నాయి. ఎఫ్సీఐ గోదాముల్లో బియ్యం మూలుగుతున్నాయి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. మిల్లులకు ధాన్యం అగ్రిమెంట్ చేసినప్పుడు ఒప్పుకొన్న మిల్లర్లు ఇప్పుడు స్థలం లేదంటూ సాకు చూపుతున్నారు. స్థలం లేనప్పుడు అధికారులు వారికి ఎలా ధాన్యం అగ్రిమెంట్ చేశారోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
టార్పాలిన్ల అద్దె భారం
అకాలవర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. టార్పాలిన్లను అద్దెకు తెచ్చుకుని ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి సరిపడా రాకపోవడంతో రైతుల ధాన్యం తడిసిపోతుంది. దీంతో రైతులే ఒక్కో టార్పాలిన్ను నిత్యం రూ.30కి అద్దెకు తెచ్చుకుంటున్నారు. తూకం వేసిన ధాన్యం వారాల తరబడి కల్లాల్లోనే ఉండడంతో టార్పాలిన్ల అద్దె భారాన్ని రైతులు భరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల