కేజీబీవీలకు నిర్వహణ నిధులు
కస్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణకు సాధారణ ఖర్చుల భారం తప్పింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల నిధులను విడుదల చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
బకాయిల చెల్లింపులకు ఉత్తర్వులు జారీ
న్యూస్టుడే,కామారెడ్డి పట్టణం
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని కేజీబీవీ
కస్తూర్బాగాంధీ విద్యాలయాల నిర్వహణకు సాధారణ ఖర్చుల భారం తప్పింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల నిధులను విడుదల చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి నెలా కేజీబీవీలకు కేటాయించే నిర్వహణ నిధుల్లో అత్యధికంగా విద్యుత్తు బిల్లులు, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నారు. ఎట్టకేలకు బకాయి నిధులు విడుదల కావడంతో బాలికల విద్యాలయాలకు కాస్త ఊరట లభించినట్లయింది. ఉమ్మడి జిల్లాలోని 32 కేజీబీవీల్లో 7650 బాలికలు అభ్యసిస్తున్నారు. మొత్తంగా నిర్వహణ నిధులు 91.80 లక్షలు ఖాతాల్లో జమకానున్నాయి.
తగ్గనున్న ఆర్థిక భారం
కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు మంజూరవుతాయి. కార్యాలయ సామగ్రి, అంతర్జాలం, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు సాధారణ నిధులను వెచ్చిస్తున్నారు. సకాలంలో నిధులు రాక ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. సుద్దముక్కల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజుల్లో విద్యాలయాలు తెరుచుకోనున్న నేపథ్యంలో నిధుల విడుదలతో ఊరట కలగనుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి విద్యార్థినికి రూ.1200 చొప్పున
ఉమ్మడి జిల్లాలో బాలికల అక్షరాస్యత పెంచేందుకు కస్తూర్బాగాంధీ విద్యాలయాలను నెలకొల్పారు. ఆర్థికంగా చతికిలపడినవారు, అనాథ పిల్లలు, మధ్యలో బడి మానేసిన బాలికలకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజన వసతి, సాయంత్రం అల్పాహారం, పాలు సరఫరా చేస్తున్నారు. వారంలో రెండుసార్లు గుడ్లు, కూరగాయలు, భోజనం కోసం ప్రతి విద్యార్థినిపై నెలకు రూ.1200 చొప్పున సర్కారు ఖర్చు పెడుతోంది. ఆహార మెనూకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ద్వారా సామగ్రిని సరఫరా చేస్తున్నారు. బాలికలకు రుచికరమైన భోజనం పెడుతుండటం, నాణ్యమైన విద్య అందిస్తుండటంతో ఏటా ప్రవేశాల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది.
వసతుల కల్పనకు
రాజు, డీఈవో-కామారెడ్డి
కేజీబీవీల్లో బకాయి నిర్వహణ నిధుల విడుదలకు ఉత్తర్వులు వచ్చాయి. త్వరలో ఈ నిధులు ఖాతాలో జమ కాగానే చిన్నపాటి వసతుల కల్పనకు చర్యలు చేపడతాం. ఈ సారి ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాలికలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీ సబ్స్క్రిప్షన్లతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
-
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం: మంత్రి నారాయణ
-
సంక్షేమ శాఖల్లో 581 పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా