కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొంటాం : మంత్రి
కొవిడ్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఇందుకోసం వైద్యశాఖ పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా కట్టడి చర్యలు, దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో
సమీక్షలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, జడ్పీ ఛైర్మన్ విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు
ఈనాడు, నిజామాబాద్: కొవిడ్ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఇందుకోసం వైద్యశాఖ పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా కట్టడి చర్యలు, దళితబంధు అమలుపై శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 946 ఆక్సిజన్ పడకలు, ప్రైవేటులో మరో 2200 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీజీహెచ్లోనే 119 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేసులు పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దవాఖానాల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 48 మంది చేరగా వీరిలో 15 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడిందన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని.. అలా అని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. గుమిగూడటం, విందులు చేసుకోవడం తగ్గించాలని సూచించారు.
సమన్వయం అవసరం : జిల్లాలో రెండో డోసు టీకా పంపిణీ నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టిగా చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, పోలీసుశాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్య లక్షణాల ఆధారంగా నాలుగు విధానాలుగా నివేదికలు రూపొందించాలన్నారు. ఇంటి వద్ద తగ్గని వారిని గుర్తించి ఆసుపత్రులకు తరలించాలన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 3.66 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచామని.. నిత్యం 1500కు పైగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు.
దళితబంధులో ఆదర్శంగా నిలవాలి : జిల్లాలో దళితబంధును సమర్థంగా అమలు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి పేర్కొన్నారు. తొలి విడతలో భాగంగా మార్చి నెలాఖరుకు నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమాభివృద్ధి శాఖలతో పాటు వ్యవసాయం, ఉద్యాన, పాడి, పరిశ్రమల శాఖలు ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పారు. యూనిట్ వ్యయంతో సంబంధం లేకుండా వ్యాపారాలు సూచించాలన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, నుడా ఛైర్మన్ ప్రభాకర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొవిడ్పై ఆందోళన అక్కర్లేదు.. అప్రమత్తత చాలు
దళితబంధు విజయవంతానికి అన్నిశాఖల తోడ్పాటు అవసరం
సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ అధ్యక్షురాలు శోభ, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం సాయంత్రం కొవిడ్ నియంత్రణ, దళితబంధు అమలుపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొదటి, రెండో దశలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి ప్రాణనష్టం పెరగకుండా చర్యలు చేపట్టిందన్నారు. అదే స్ఫూర్తితో మూడో దశను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పీహెచ్సీలతో పాటు ఉపకేంద్రాల్లో 1,81,000, జిల్లా కేంద్రంలో 31 వేల ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రెండు రోజులుగా 1,12,345 ఇళ్లకు వెళ్లి 2,714 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారన్నారు. ప్రజలు మరో 15 రోజుల పాటు విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 337 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు ఎమ్మెల్యేలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. విప్ మాట్లాడుతూ.. పల్లెల్లో ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ పురపాలికల్లో నామమాత్రంగా ఉందన్నారు. సర్వే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే మాట్లాడుతూ దళితబంధు పథకం అమల్లో లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికే కీలకమన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 350 మందిని ఎంపిక చేయనున్న నేపథ్యంలో వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ దఫేదార్ శోభ, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, కామారెడ్డి పురపాలక సంఘం వైస్ఛైర్మన్ ఇందుప్రియ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!