logo

దక్షిణ ప్రాంగణంలో రిజిస్ట్రార్‌ తనిఖీ

తెవివి దక్షిణ ప్రాంగణాన్ని బుధవారం రిజిస్ట్రార్‌ శివశంకర్‌ తనిఖీ చేశారు. ప్రాంగణంలోని అన్ని విభాగాలు, తరగతులను పరిశీలించి సదుపాయాలు, సమస్యలపై ఆరా తీశారు. సోషల్‌ వర్క్‌ విభాగాధిపతి, బీవోఎస్‌

Published : 26 May 2022 06:39 IST

భిక్కనూరు, న్యూస్‌టుడే: తెవివి దక్షిణ ప్రాంగణాన్ని బుధవారం రిజిస్ట్రార్‌ శివశంకర్‌ తనిఖీ చేశారు. ప్రాంగణంలోని అన్ని విభాగాలు, తరగతులను పరిశీలించి సదుపాయాలు, సమస్యలపై ఆరా తీశారు. సోషల్‌ వర్క్‌ విభాగాధిపతి, బీవోఎస్‌ గదులకు తాళాలు వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంవహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే సెమిస్టర్‌ తరగతులు మొదలయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం బాలుర వసతిగృహాన్ని పరిశీలించి భోజనశాలలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రిన్సిపల్‌ లావణ్య, ఏపీఆర్‌వో యాలాద్రి, అధ్యాపకులు నారాయణ, నిరంజన్, నర్సయ్య, సరిత, దిలీప్‌ ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని